ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధేశ్యామ్’ కంటే దీని తర్వాత చేయబోయే ‘సలార్’ మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ సినిమాను తీయబోయేది ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ డెడ్లీ కాంబినేషన్లో రాబోయేది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అనే సంకేతాలు ఫస్ట్ లుక్ చూసినపుడే వచ్చేశాయి. పవర్ ఫుల్ టైటిల్ పెట్టి.. మాంచి పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాడు ప్రశాంత్. ఈ సినిమా జనవరి నెలాఖర్లోనే సెట్స్ మీదికి వెళ్లబోతుండటం విశేషం.
ప్రస్తుతం ‘కేజీఎఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే ‘సలార్’ మీదా వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్. నటీనటుల ఎంపిక మీద కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో ఓ కీలక పాత్రకు మోహన్ లాల్ను అనుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నిజంగా ప్రభాస్-లాల్ కాంబినేషన్ ఓకే అయితే అంతకంటే ఎగ్జైటింగ్ న్యూస్ ఇంకోటి ఉండదు.
కాగా ఇప్పుడు ‘సలార్’ కథానాయిక విషయంలోనూ ఒక ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠాని ఈ చిత్రంలో ప్రభాస్తో జోడీ కట్టనుందట. కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలే చేసింది కానీ.. ఆ తర్వాత దిశ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్లో ఇప్పుడు హాట్నెస్కు కేరాఫ్ అడ్రస్ దిశానే. ఆమె ఫిగర్ ముందు చాలామంది హీరోయిన్లు వెలవెలబోతారు. సినిమాల్ని మించి తన ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది దిశా.
తెలుగులో ఆమె ‘లోఫర్’ అనే ఒక్క సినిమా మాత్రమే చేసింది. అది సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్కు పరిమితం అయింది. కానీ ఆమెకు దక్షిణాదిన ఫాలోయింగ్ ఏమీ తక్కువగా లేదు. ఉత్తరాదిన ఎలాగూ పాపులరే కాబట్టి ప్రభాస్ పక్కన జోడీ కట్టిస్తే సినిమాకు కలిసొస్తుందని ప్రశాంత్ భావిస్తున్నాడట. బాలీవుడ్ మీడియాలోనూ ‘సలార్’ కథానాయిక దిశానే అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారాన్ని కొట్టిపారేయలేం.
This post was last modified on December 24, 2020 3:45 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…