ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధేశ్యామ్’ కంటే దీని తర్వాత చేయబోయే ‘సలార్’ మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ సినిమాను తీయబోయేది ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ డెడ్లీ కాంబినేషన్లో రాబోయేది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అనే సంకేతాలు ఫస్ట్ లుక్ చూసినపుడే వచ్చేశాయి. పవర్ ఫుల్ టైటిల్ పెట్టి.. మాంచి పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాడు ప్రశాంత్. ఈ సినిమా జనవరి నెలాఖర్లోనే సెట్స్ మీదికి వెళ్లబోతుండటం విశేషం.
ప్రస్తుతం ‘కేజీఎఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే ‘సలార్’ మీదా వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్. నటీనటుల ఎంపిక మీద కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో ఓ కీలక పాత్రకు మోహన్ లాల్ను అనుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నిజంగా ప్రభాస్-లాల్ కాంబినేషన్ ఓకే అయితే అంతకంటే ఎగ్జైటింగ్ న్యూస్ ఇంకోటి ఉండదు.
కాగా ఇప్పుడు ‘సలార్’ కథానాయిక విషయంలోనూ ఒక ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠాని ఈ చిత్రంలో ప్రభాస్తో జోడీ కట్టనుందట. కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలే చేసింది కానీ.. ఆ తర్వాత దిశ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్లో ఇప్పుడు హాట్నెస్కు కేరాఫ్ అడ్రస్ దిశానే. ఆమె ఫిగర్ ముందు చాలామంది హీరోయిన్లు వెలవెలబోతారు. సినిమాల్ని మించి తన ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది దిశా.
తెలుగులో ఆమె ‘లోఫర్’ అనే ఒక్క సినిమా మాత్రమే చేసింది. అది సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్కు పరిమితం అయింది. కానీ ఆమెకు దక్షిణాదిన ఫాలోయింగ్ ఏమీ తక్కువగా లేదు. ఉత్తరాదిన ఎలాగూ పాపులరే కాబట్టి ప్రభాస్ పక్కన జోడీ కట్టిస్తే సినిమాకు కలిసొస్తుందని ప్రశాంత్ భావిస్తున్నాడట. బాలీవుడ్ మీడియాలోనూ ‘సలార్’ కథానాయిక దిశానే అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారాన్ని కొట్టిపారేయలేం.
This post was last modified on December 24, 2020 3:45 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…