ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధేశ్యామ్’ కంటే దీని తర్వాత చేయబోయే ‘సలార్’ మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ సినిమాను తీయబోయేది ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ డెడ్లీ కాంబినేషన్లో రాబోయేది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అనే సంకేతాలు ఫస్ట్ లుక్ చూసినపుడే వచ్చేశాయి. పవర్ ఫుల్ టైటిల్ పెట్టి.. మాంచి పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాడు ప్రశాంత్. ఈ సినిమా జనవరి నెలాఖర్లోనే సెట్స్ మీదికి వెళ్లబోతుండటం విశేషం.
ప్రస్తుతం ‘కేజీఎఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే ‘సలార్’ మీదా వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్. నటీనటుల ఎంపిక మీద కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో ఓ కీలక పాత్రకు మోహన్ లాల్ను అనుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నిజంగా ప్రభాస్-లాల్ కాంబినేషన్ ఓకే అయితే అంతకంటే ఎగ్జైటింగ్ న్యూస్ ఇంకోటి ఉండదు.
కాగా ఇప్పుడు ‘సలార్’ కథానాయిక విషయంలోనూ ఒక ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠాని ఈ చిత్రంలో ప్రభాస్తో జోడీ కట్టనుందట. కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలే చేసింది కానీ.. ఆ తర్వాత దిశ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్లో ఇప్పుడు హాట్నెస్కు కేరాఫ్ అడ్రస్ దిశానే. ఆమె ఫిగర్ ముందు చాలామంది హీరోయిన్లు వెలవెలబోతారు. సినిమాల్ని మించి తన ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది దిశా.
తెలుగులో ఆమె ‘లోఫర్’ అనే ఒక్క సినిమా మాత్రమే చేసింది. అది సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్కు పరిమితం అయింది. కానీ ఆమెకు దక్షిణాదిన ఫాలోయింగ్ ఏమీ తక్కువగా లేదు. ఉత్తరాదిన ఎలాగూ పాపులరే కాబట్టి ప్రభాస్ పక్కన జోడీ కట్టిస్తే సినిమాకు కలిసొస్తుందని ప్రశాంత్ భావిస్తున్నాడట. బాలీవుడ్ మీడియాలోనూ ‘సలార్’ కథానాయిక దిశానే అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారాన్ని కొట్టిపారేయలేం.
This post was last modified on December 24, 2020 3:45 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…