టాలీవుడ్ నటుడు సునీల్ పరిస్థితి కొన్నేళ్ల నుంచి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. కమెడియన్గా మాంచి ఊపుమీదున్న సమయంలో హీరో వేషాలపై మోజు చూపించాడు. మొదట్లో చేసిన ‘అందాల రాముడు’.. ‘మర్యాద రామన్న’ తరహాలో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లే చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ‘పూల రంగడు’ తర్వాత తనను తాను ఎక్కువ ఊహించుకుని బాడీ మార్చుకున్నాడు. ఫైట్లు.. డ్యాన్సులంటూ అతి చేశాడు. మొత్తంగా తన కామెడీ ఇమేజ్ను దెబ్బ తీసుకున్నాడు.
సునీల్ కామెడీ పండటానికి అతడి లుక్.. కామెడీ టైమింగ్ ముఖ్య కారణాలు. అవి రెండూ పోవడంతో అతడిని జనాలు చూసే కోణమే మారిపోయింది. ఈ స్థితిలో ఒక దశ దాటాక హీరోగానే సునీల్ కామెడీ కోసం ప్రయత్నిస్తుంటే చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. అంతకుముందులా నవ్వించడంలో అతను పూర్తిగా ఫెయిలయ్యాడు. దీంతో ఈ మధ్య క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు సునీల్ మళ్లీ హీరోగా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అది రీమేక్ మూవీ అట. కన్నడలో విజయవంతమైన బెల్ బాటమ్ సినిమాను సునీల్ హీరోగా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఓ నిర్మాత ఈ సినిమా హక్కులు కొని హీరో, దర్శకుడి కోసం చూస్తున్నారట. హీరో పాత్ర, దాని లుక్ ప్రకారం సునీల్ అయితే ఈ సినిమాకు బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ కూడా ఈ సినిమాలో నటించడం పట్ల ఆసక్తితోనే ఉన్నాడట.
విశేషం ఏంటంటే.. బెల్ బాటమ్ ఇప్పటికే తెలుగులోకి డబ్బింగ్ అయి ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ వింటేజ్ డిటెక్టివ్ థ్రిల్లర్ కన్నడలో సూపర్ హిట్టవగా.. తెలుగులో చూసిన వాళ్లు కూడా మంచి ఫీడ్ బ్యాకే ఇస్తున్నారు. మరి నిజంగా సునీల్ ఈ సినిమా రీమేక్లో నటిస్తాడేమో చూడాలి.
This post was last modified on December 24, 2020 10:06 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…