కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వార్తే నిజమైంది. కన్నడ భామ రష్మిక మందన్నా బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఆమె సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ అనే సినిమాతో హిందీలో అడుగు పెట్టనుంది. శాంతను బాగ్చి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అమర్ బుటాలతో కలిసి ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బుధవారమే ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.
‘ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్’ అంటూ ఈ సినిమా కథ గురించి సంకేతాలు ఇచ్చారు. పోస్టర్ బ్యాగ్రౌండ్లో పేలుళ్లు, మంటలు.. మ్యాప్లో పాకిస్థాన్ పేరు.. ఇదంతా చూస్తే టెర్రరిస్టుల కార్యకలాపాల్ని ఛేదించేందుకు ఓ ఏజెంట్ చేసే సాహసం నేపథ్యంలో ఈ సినిమా కథ నడిచేలా ఉంది. రష్మిక బాలీవుడ్ ఎంట్రీకి మంచి సినిమానే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే క్యాంపస్ లవ్ స్టోరీతో రష్మిక కథానాయికగా పరిచయమైంది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయి రష్మికను రాత్రికి రాత్రి స్టార్ను చేసేసింది. తర్వాత ఆమె ‘ఛలో’ లాంటి సూపర్ హిట్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై విజయ్ దేవరకొండ సరసన చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయి ఇక్కడా రష్మిక స్టార్ అయిపోయింది. తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది.
త్వరలోనే రష్మిక తమిళంలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. కార్తి సరసన ‘సుల్తాన్’ సినిమాలో ఆమే కథానాయిక. ఇప్పటికే మూడు భాషల్ని కవర్ చేసిన రష్మిక.. ఇప్పుడు హిందీలోనూ అడుగు పెట్టేసింది. గత రెండు దశాబ్దాల్లో దక్షిణాది నుంచి బాలీవుడ్లోకి వెళ్లి సక్సెస్ అయిన హీరోయిన్లు పెద్దగా కనిపించరు. మరి రష్మిక బాలీవుడ్లో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
This post was last modified on December 23, 2020 1:48 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…