మెగా-మంచు కుటుంబాల మధ్య మధ్యలో కొన్నేళ్లు మినహాయిస్తే మంచి సంబంధాలే ఉన్నాయి. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకలో, ఆ తర్వాత చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం దక్కినపుడు జరిగిన ఓ వేడుకలో తలెత్తిన విభేదాల వల్ల కొంత అంతరం వచ్చింది కానీ.. కొన్నేళ్ల తర్వాత పరిస్థితులు సర్దుకున్నాయి.
చిరు, మోహన్ బాబు అప్పట్నుంచి చాలా సన్నిహితంగానే మెలుగుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరు, మోహన్ బాబుల సాన్నిహిత్యమే హాట్ టాపిక్ అయింది. ఇప్పుడీ ప్రస్తావనంతా ఎందుకు అంటే.. తాజాగా చిరంజీవిని మంచు విష్ణు వెళ్లి ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ఆయనతో కలిసి ఉన్న ఫొటోను కూడా ట్విట్టర్లో షేర్ చేశాడు. దానికి అతను జోడించిన వ్యాఖ్యను బట్టి చూస్తే ఈ కలయికలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే కనిపిస్తోంది.
ఈ రోజు బిగ్ బాస్ చిరంజీవి అంకుల్ను కలిశా. ఆయన్నెందుకు కలిశానో త్వరలోనే వెల్లడిస్తా. ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించే అవకాశం దక్కింది. చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన మెగాస్టార్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు అని వ్యాఖ్యానించాడు విష్ణు. మరి ఇప్పుడు విష్ణు వ్యక్తిగతంగా వెళ్లి చిరును ఎందుకు కలిశాడు.. త్వరలో అతనేం చెప్పబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
తన కొత్త చిత్రం మోసగాళ్లు సినిమా టీజర్, ట్రైలర్ లాంటివి ఆయనతో లాంచ్ చేయించబోతున్నాడా.. ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఆయన్నేమైనా ఆహ్వానించాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికోసమే అయితే చిరును వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరముందా అన్నది డౌట్. మరి చిరు భాగస్వామ్యంతో ఇంకేదైనా విష్ణు చేయబోతున్నాడా అన్నది ఆసక్తికరం.
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…