Movie News

చిరు కోసం అలా మారుస్తున్నార‌ట‌

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస‌గా రెండు రీమేక్ సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో మొద‌టిది మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ లూసిఫ‌ర్ ఆధారంగా తెర‌కెక్క‌నున్న సినిమా. ఇటీవ‌లే ఈ చిత్రానికి తెలుగువాడైన త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజాను ద‌ర్శ‌కుడిగా ఖ‌రారు చేశారు. ఇంత‌కుముందు సుజీత్, వి.వి.వినాయ‌క్ ఈ ప్రాజెక్టు మీద ప‌ని చేశారు. కానీ వాళ్లిద్ద‌రూ చిరు కోరుకున్న‌ట్లుగా స్క్రిప్టు త‌యారు చేయ‌లేక‌పోయారు.

రీమేక్‌లు తీయ‌డంలో మంచి నైపుణ్యం ఉండి, అలాగే ఒరిజిన‌ల్ సినిమాల్లోనూ త‌న‌దైన ముద్ర చూపించిన మోహ‌న్ రాజా.. చిరును త‌న స్క్రిప్టుతో మెప్పించ‌గ‌లిగాడు. ఒరిజిన‌ల్‌తో పోలిస్తే ఇంకొంచెం వినోదాత్మ‌కంగా, క‌మ‌ర్షియ‌ల్ అంశాల క‌ల‌బోతతో సినిమా ఉండాల‌ని చిరు కోరుకున్నారు. రాజా ఆ ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.

చిరు సినిమా అన్నాక క‌థానాయిక లేకుంటే చాలా క‌ష్టం. లూసిఫ‌ర్‌లో మోహ‌న్ లాల్‌కు జోడీ ఉండ‌దు. తెలుగులో ఆ పాత్ర‌ను అలాగే చూపిస్తే స‌రిపోద‌ని.. హీరోయిన్, రెండు మూడు పాట‌లు లేకుండా త‌న అభిమానులు ఒప్పుకోర‌ని చిరు బ‌ల‌మైన అభిప్రాయంతో ఉన్నార‌ట‌. రాజా ఆ మేర‌కు కొత్త ఎపిసోడ్ జోడించి హీరోయిన్ పాత్ర‌కు స్కోప్ ఇచ్చార‌ట‌.

ఈ పాత్ర కోసం స‌రైన హీరోయిన్ని ఎంచుకోవాల‌ని చూస్తున్నారు. ఇందుకోసం ఇలియానా పేరు కూడా వినిపిస్తుండ‌టం విశేషం. చిరు వ‌య‌సు సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల‌ను సెట్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇలియానా వైపు చూస్తున్నార‌ట‌. హీరోయిన్ ఎపిసోడ్‌తో పాటు కొన్ని కామెడీ, యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ను కూడా రీమేక్‌లో చేరుస్తున్న‌ట్లు స‌మాచారం.

This post was last modified on December 23, 2020 9:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

24 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago