మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు రీమేక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో మొదటిది మలయాళ బ్లాక్బస్టర్ లూసిఫర్ ఆధారంగా తెరకెక్కనున్న సినిమా. ఇటీవలే ఈ చిత్రానికి తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజాను దర్శకుడిగా ఖరారు చేశారు. ఇంతకుముందు సుజీత్, వి.వి.వినాయక్ ఈ ప్రాజెక్టు మీద పని చేశారు. కానీ వాళ్లిద్దరూ చిరు కోరుకున్నట్లుగా స్క్రిప్టు తయారు చేయలేకపోయారు.
రీమేక్లు తీయడంలో మంచి నైపుణ్యం ఉండి, అలాగే ఒరిజినల్ సినిమాల్లోనూ తనదైన ముద్ర చూపించిన మోహన్ రాజా.. చిరును తన స్క్రిప్టుతో మెప్పించగలిగాడు. ఒరిజినల్తో పోలిస్తే ఇంకొంచెం వినోదాత్మకంగా, కమర్షియల్ అంశాల కలబోతతో సినిమా ఉండాలని చిరు కోరుకున్నారు. రాజా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.
చిరు సినిమా అన్నాక కథానాయిక లేకుంటే చాలా కష్టం. లూసిఫర్లో మోహన్ లాల్కు జోడీ ఉండదు. తెలుగులో ఆ పాత్రను అలాగే చూపిస్తే సరిపోదని.. హీరోయిన్, రెండు మూడు పాటలు లేకుండా తన అభిమానులు ఒప్పుకోరని చిరు బలమైన అభిప్రాయంతో ఉన్నారట. రాజా ఆ మేరకు కొత్త ఎపిసోడ్ జోడించి హీరోయిన్ పాత్రకు స్కోప్ ఇచ్చారట.
ఈ పాత్ర కోసం సరైన హీరోయిన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇలియానా పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. చిరు వయసు సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలియానా వైపు చూస్తున్నారట. హీరోయిన్ ఎపిసోడ్తో పాటు కొన్ని కామెడీ, యాక్షన్ ఎపిసోడ్లను కూడా రీమేక్లో చేరుస్తున్నట్లు సమాచారం.
This post was last modified on December 23, 2020 9:14 am
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ…
రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…