మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు రీమేక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో మొదటిది మలయాళ బ్లాక్బస్టర్ లూసిఫర్ ఆధారంగా తెరకెక్కనున్న సినిమా. ఇటీవలే ఈ చిత్రానికి తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజాను దర్శకుడిగా ఖరారు చేశారు. ఇంతకుముందు సుజీత్, వి.వి.వినాయక్ ఈ ప్రాజెక్టు మీద పని చేశారు. కానీ వాళ్లిద్దరూ చిరు కోరుకున్నట్లుగా స్క్రిప్టు తయారు చేయలేకపోయారు.
రీమేక్లు తీయడంలో మంచి నైపుణ్యం ఉండి, అలాగే ఒరిజినల్ సినిమాల్లోనూ తనదైన ముద్ర చూపించిన మోహన్ రాజా.. చిరును తన స్క్రిప్టుతో మెప్పించగలిగాడు. ఒరిజినల్తో పోలిస్తే ఇంకొంచెం వినోదాత్మకంగా, కమర్షియల్ అంశాల కలబోతతో సినిమా ఉండాలని చిరు కోరుకున్నారు. రాజా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.
చిరు సినిమా అన్నాక కథానాయిక లేకుంటే చాలా కష్టం. లూసిఫర్లో మోహన్ లాల్కు జోడీ ఉండదు. తెలుగులో ఆ పాత్రను అలాగే చూపిస్తే సరిపోదని.. హీరోయిన్, రెండు మూడు పాటలు లేకుండా తన అభిమానులు ఒప్పుకోరని చిరు బలమైన అభిప్రాయంతో ఉన్నారట. రాజా ఆ మేరకు కొత్త ఎపిసోడ్ జోడించి హీరోయిన్ పాత్రకు స్కోప్ ఇచ్చారట.
ఈ పాత్ర కోసం సరైన హీరోయిన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇలియానా పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. చిరు వయసు సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలియానా వైపు చూస్తున్నారట. హీరోయిన్ ఎపిసోడ్తో పాటు కొన్ని కామెడీ, యాక్షన్ ఎపిసోడ్లను కూడా రీమేక్లో చేరుస్తున్నట్లు సమాచారం.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…