ఆన్ లైన్ స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఇండియాలో కొన్నేళ్ల నుంచి వెబ్ సిరీస్లు రూపొందిస్తోంది. హిందీలో చాలానే సిరీస్లు నిర్మించింది. తమిళ పరిశ్రమ నుంచి ప్రముఖ ఫిలిం మేకర్లు నెట్ ఫ్లిక్స్కు కంటెంట్ చేసి ఇచ్చారు. కానీ తెలుగులో మాత్రం నెట్ ఫ్లిక్స్ ఇప్పటిదాకా ఒక్క సిరీస్ కూడా రూపొందించలేదు. ఇక్కడి నుంచి సినిమాలు కూడా ఈ మధ్యనే కొంటోంది.
వెబ్ సిరీస్ల కోసం కొన్నేళ్ల ముందు నుంచే సన్నాహాలు మొదలయ్యాయి కానీ.. ఏదీ ఇంకా వర్కవుట్ కాలేదు. లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ల తయారీ గత ఏడాదే మొదలైంది. కానీ అవి ఎంత వరకు వచ్చాయో తెలియడం లేదు. ఇక బాహుబలికి కొనసాగింపుగా వెబ్ సిరీస్ గురించి రెండు మూడేళ్ల ముందే నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు మొదలుపెట్టింది. కానీ అది ఎంతకూ ఓ కొలిక్కి రాలేదు.
దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు ఈ ప్రాజెక్టు మీద కొంత కాలం పని చేసిన సంగతి తెలిసిందే. ఐతే వారి పనితీరు నెట్ ఫ్లిక్స్ వాళ్లకు సంతృప్తి కరంగా అనిపించలేదో ఏమో పక్కన పెట్టేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టే ఆపేశారేమో అనుకుంటే.. అలాంటిదేమీ లేదన్నది తాజా సమాచారం. ఇప్పుడు ఓ కొత్త దర్శకుడిని ఈ మెగా ప్రాజెక్టు కోసం ఎంచుకున్నారు.
అతడి పేరు.. విశ్వేష్ కృష్ణమూర్తి. తమిళుడైన ఈ యంగ్ డైరెక్టర్.. ఏఆర్ రెహమాన్ కలల ప్రాజెక్టు 99 సాంగ్స్తో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమా మేకింగ్ దశలో ఉంది. ఇంకా విడుదల కాలేదు. ఈలోపే విశ్వేష్ ప్రతిభ గురించి తెలిసిన నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు.. అతడికి బాహుబలి సిరీస్ బాధ్యతలు అప్పగించారట. మరి ఈ మెగా ప్రాజెక్టును అతనెలా డీల్ చేస్తాడో చూడాలి.
This post was last modified on December 23, 2020 9:12 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…