సింగర్ సునీత రెండో పెళ్లి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థం చేసుకుని తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది సునీత. భర్త నుంచి చాలా ఏళ్ల కిందటే విడిపోయిన సునీత.. తన కష్టంతో పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేశారు. వాళ్లిద్దరూ యుక్త వయసులో ఉండగా.. వారి అంగీకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. రామ్ అనే మీడియా వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుండగా.. దానికి ముందు ప్రి వెడ్డింగ్ పార్టీని గ్రాండ్గా నిర్వహించింది రామ్-సునీత జంట. ఈ వేడుకను హీరో నితిన్ తన చేతుల మీదుగా నిర్వహించడం విశేషం. ఈ బాధ్యత నితిన్ తీసుకోవడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. ఐతే సునీతకు కాబోయే భర్త రామ్ నితిన్కు బాగా క్లోజ్ అట. అందుకే నితిన్ ఈ పార్టీని ఏర్పాటు చేశాడట.
జూబ్లీ హిల్స్లోని ఓ హోటల్లో జరిగిన ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొనడం విశేషం. సునీతతో ఆమెకు మంచి అనుబంధం ఉందట. మొదటి పెళ్లి విఫలమైనప్పటికీ.. ఒక తోడుండగాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని రేణు బలంగా చెబుతుంటుంది. తన పిల్లల అంగీకారంతో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. రెండేళ్ల కిందట నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ఏ అప్ డేట్ ఇవ్వలేదు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని దాని గురించి గోప్యంగా ఉంచుతోందా.. లేక పెళ్లి చేసుకోలేదా అన్నది జనాలకు తెలియడం లేదు. ఆ సంగతలా ఉంచితే సునీత ప్రి వెడ్డింగ్ పార్టీలో యాంకర్ సుమతో పాటు టాలీవుడ్ సింగర్లు కూడా కొందరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫొటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి చాలా సింపుల్గా చేసుకోవాలని సునీత, రామ్ భావిస్తున్నారట. అందుకే దానికి ముందు ప్రి వెడ్డింగ్ పార్టీ గ్రాండ్గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on December 22, 2020 9:07 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…