సింగర్ సునీత రెండో పెళ్లి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థం చేసుకుని తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది సునీత. భర్త నుంచి చాలా ఏళ్ల కిందటే విడిపోయిన సునీత.. తన కష్టంతో పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేశారు. వాళ్లిద్దరూ యుక్త వయసులో ఉండగా.. వారి అంగీకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. రామ్ అనే మీడియా వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుండగా.. దానికి ముందు ప్రి వెడ్డింగ్ పార్టీని గ్రాండ్గా నిర్వహించింది రామ్-సునీత జంట. ఈ వేడుకను హీరో నితిన్ తన చేతుల మీదుగా నిర్వహించడం విశేషం. ఈ బాధ్యత నితిన్ తీసుకోవడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. ఐతే సునీతకు కాబోయే భర్త రామ్ నితిన్కు బాగా క్లోజ్ అట. అందుకే నితిన్ ఈ పార్టీని ఏర్పాటు చేశాడట.
జూబ్లీ హిల్స్లోని ఓ హోటల్లో జరిగిన ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొనడం విశేషం. సునీతతో ఆమెకు మంచి అనుబంధం ఉందట. మొదటి పెళ్లి విఫలమైనప్పటికీ.. ఒక తోడుండగాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని రేణు బలంగా చెబుతుంటుంది. తన పిల్లల అంగీకారంతో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. రెండేళ్ల కిందట నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ఏ అప్ డేట్ ఇవ్వలేదు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని దాని గురించి గోప్యంగా ఉంచుతోందా.. లేక పెళ్లి చేసుకోలేదా అన్నది జనాలకు తెలియడం లేదు. ఆ సంగతలా ఉంచితే సునీత ప్రి వెడ్డింగ్ పార్టీలో యాంకర్ సుమతో పాటు టాలీవుడ్ సింగర్లు కూడా కొందరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫొటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి చాలా సింపుల్గా చేసుకోవాలని సునీత, రామ్ భావిస్తున్నారట. అందుకే దానికి ముందు ప్రి వెడ్డింగ్ పార్టీ గ్రాండ్గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on December 22, 2020 9:07 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…