సింగర్ సునీత రెండో పెళ్లి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థం చేసుకుని తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది సునీత. భర్త నుంచి చాలా ఏళ్ల కిందటే విడిపోయిన సునీత.. తన కష్టంతో పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేశారు. వాళ్లిద్దరూ యుక్త వయసులో ఉండగా.. వారి అంగీకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. రామ్ అనే మీడియా వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుండగా.. దానికి ముందు ప్రి వెడ్డింగ్ పార్టీని గ్రాండ్గా నిర్వహించింది రామ్-సునీత జంట. ఈ వేడుకను హీరో నితిన్ తన చేతుల మీదుగా నిర్వహించడం విశేషం. ఈ బాధ్యత నితిన్ తీసుకోవడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. ఐతే సునీతకు కాబోయే భర్త రామ్ నితిన్కు బాగా క్లోజ్ అట. అందుకే నితిన్ ఈ పార్టీని ఏర్పాటు చేశాడట.
జూబ్లీ హిల్స్లోని ఓ హోటల్లో జరిగిన ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొనడం విశేషం. సునీతతో ఆమెకు మంచి అనుబంధం ఉందట. మొదటి పెళ్లి విఫలమైనప్పటికీ.. ఒక తోడుండగాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని రేణు బలంగా చెబుతుంటుంది. తన పిల్లల అంగీకారంతో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. రెండేళ్ల కిందట నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ఏ అప్ డేట్ ఇవ్వలేదు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని దాని గురించి గోప్యంగా ఉంచుతోందా.. లేక పెళ్లి చేసుకోలేదా అన్నది జనాలకు తెలియడం లేదు. ఆ సంగతలా ఉంచితే సునీత ప్రి వెడ్డింగ్ పార్టీలో యాంకర్ సుమతో పాటు టాలీవుడ్ సింగర్లు కూడా కొందరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫొటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి చాలా సింపుల్గా చేసుకోవాలని సునీత, రామ్ భావిస్తున్నారట. అందుకే దానికి ముందు ప్రి వెడ్డింగ్ పార్టీ గ్రాండ్గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on December 22, 2020 9:07 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…