Movie News

త్రివిక్రమ్ ఉన్నట్టా లేనట్టా?

రీఎంట్రీలో జోరుమీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొత్తగా ఇంకో సినిమా మొదలుపెట్టేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఆయన కొత్త చిత్రం సోమవారమే మొదలైంది. అయ్యారె, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి చిన్న సినిమాలతో మంచి పేరు సంపాదించిన సాగర్.కె.చంద్ర ఈ పెద్ద సినిమాకు దర్శకత్వం వహించనుండటం విశేషమే. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్‌తో పాటు రానా దగ్గుబాటి నటించనున్న సంగతి కూడా అధికారికంగా ఖరారైంది.

త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుంది. క్రిష్ సినిమాతో పాటే ఈ చిత్రంలోనూ పవన్ సమాంతరంగా నటిస్తాడని అంటున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాగా.. ‘అత్తారింటికి దారేది’ తర్వాత ప్రసాద్ మూరెళ్ల మళ్లీ పవన్ నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించనున్నాడు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

వీళ్లందరి పేర్లూ పోస్టర్ల మీద పడ్డాయి. ఐతే త్రివిక్రమ్ పేరు కూడా కనిపిస్తుందేమో అని చాలామంది ఆసక్తిగా చూశారు కానీ.. అదేమీ కనిపించలేదు. పవన్ ఈ సినిమా ఒప్పుకోవడంలో అత్యంత కీలక పాత్ర త్రివిక్రమ్‌దే అని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. సితార వాళ్లు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ హక్కులు తీసుకున్నాక లీడ్ ఆర్టిస్టుల ఎంపికలో చాలా తర్జన భర్జనలు నడిచాయి. కానీ అనూహ్యంగా పవన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు.

సాగర్ లాంటి చిన్న దర్శకుడు ఈ చిత్రాన్ని టేకప్ చేయడం మరో షాక్. అతను పవన్‌ను హ్యాండిల్ చేయగలడా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఐతే తన వాళ్లయిన నిర్మాతల కోసం పవన్‌ను ఈ సినిమాకు ఒప్పించడమే కాక.. ఈ సినిమాకు రచన బాధ్యత కూడా త్రివిక్రమ్ తీసుకున్నట్లుగా వార్తలొచ్చాయి. స్క్రిప్టు బాధ్యతంతా ఆయన చూసుకున్నాడు కాబట్టే పవన్ ధీమాగా ఈ సినిమా చేసినట్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడేమో పోస్టర్ మీద త్రివిక్రమ్ పేరు కనిపించలేదు. నిజంగా త్రివిక్రమ్ రచన చేస్తుంటే.. అది వెల్లడిస్తే సినిమాకు ఇంకా క్రేజ్ వస్తుంది. మరి ఎందుకా విషయాన్ని దాచి పెడుతున్నట్లో?

This post was last modified on December 21, 2020 3:38 pm

Share
Show comments

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

2 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

5 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

5 hours ago