రీఎంట్రీలో జోరుమీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొత్తగా ఇంకో సినిమా మొదలుపెట్టేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఆయన కొత్త చిత్రం సోమవారమే మొదలైంది. అయ్యారె, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి చిన్న సినిమాలతో మంచి పేరు సంపాదించిన సాగర్.కె.చంద్ర ఈ పెద్ద సినిమాకు దర్శకత్వం వహించనుండటం విశేషమే. మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్తో పాటు రానా దగ్గుబాటి నటించనున్న సంగతి కూడా అధికారికంగా ఖరారైంది.
త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుంది. క్రిష్ సినిమాతో పాటే ఈ చిత్రంలోనూ పవన్ సమాంతరంగా నటిస్తాడని అంటున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాగా.. ‘అత్తారింటికి దారేది’ తర్వాత ప్రసాద్ మూరెళ్ల మళ్లీ పవన్ నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించనున్నాడు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
వీళ్లందరి పేర్లూ పోస్టర్ల మీద పడ్డాయి. ఐతే త్రివిక్రమ్ పేరు కూడా కనిపిస్తుందేమో అని చాలామంది ఆసక్తిగా చూశారు కానీ.. అదేమీ కనిపించలేదు. పవన్ ఈ సినిమా ఒప్పుకోవడంలో అత్యంత కీలక పాత్ర త్రివిక్రమ్దే అని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. సితార వాళ్లు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ హక్కులు తీసుకున్నాక లీడ్ ఆర్టిస్టుల ఎంపికలో చాలా తర్జన భర్జనలు నడిచాయి. కానీ అనూహ్యంగా పవన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు.
సాగర్ లాంటి చిన్న దర్శకుడు ఈ చిత్రాన్ని టేకప్ చేయడం మరో షాక్. అతను పవన్ను హ్యాండిల్ చేయగలడా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఐతే తన వాళ్లయిన నిర్మాతల కోసం పవన్ను ఈ సినిమాకు ఒప్పించడమే కాక.. ఈ సినిమాకు రచన బాధ్యత కూడా త్రివిక్రమ్ తీసుకున్నట్లుగా వార్తలొచ్చాయి. స్క్రిప్టు బాధ్యతంతా ఆయన చూసుకున్నాడు కాబట్టే పవన్ ధీమాగా ఈ సినిమా చేసినట్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడేమో పోస్టర్ మీద త్రివిక్రమ్ పేరు కనిపించలేదు. నిజంగా త్రివిక్రమ్ రచన చేస్తుంటే.. అది వెల్లడిస్తే సినిమాకు ఇంకా క్రేజ్ వస్తుంది. మరి ఎందుకా విషయాన్ని దాచి పెడుతున్నట్లో?
This post was last modified on December 21, 2020 3:38 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…