హీరో శ్రీవిష్ణు ఈరోజు పెద్ద బాంబు వేశారు. విష్ణు విన్యాసం డిసెంబర్ లోనే పార్టులుగా లీకయ్యిందని, అందుకే హడావిడిగా షూటింగ్ పూర్తి చేసి త్వరగా థియేటర్లకు తీసుకొచ్చామని అన్నాడు. పైరసీ చేసినవాళ్లు నిర్మాతను చాలా బెదిరించారని, రీల్ రీల్ కు డబ్బులు డిమాండ్ చేశారని, అయినా సరే ఆయన ధైర్యంగా పోరాటాన్ని సాగించారని వివరించాడు.
చెన్నై కేంద్రంగా జరిగిన ఈ లీకు ప్రస్తుతం పోలీస్ కేసులో ఉంది కాబట్టి త్వరలోనే వివరాలు బయటికి వస్తాయని అన్నారు. ఫిబ్రవరి దాకా ఈ తతంగం కొనసాగుతూనే వచ్చిందని, అందుకే ఇరవై రోజుల షెడ్యూల్ ని వారంలోనే పూర్తి చేసి ఈ సినిమా అందించామని శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ సీరియస్ గా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పైరసీ గురించి ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు తమ నిరసన గళాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పుడు ఇక ఆన్ లైన్ లో కొత్త సినిమా ప్రింట్లు రావని అందరూ భుజాలు ఎగరేసుకున్నారు. కానీ రవి నిర్వహించే యాప్స్ ఆగిపోయాయి కానీ పైరసీ అంతరించిపోలేదు. కొనసాగుతూనే ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే అత్తారింటికి దారేది నుంచి విష్ణువిన్యాసం దాకా ఎన్నో సినిమాలు బిఫోర్ రిలీజ్ లీక్ బారిన పడ్డాయి. విజయ్ దేవరకొండ టాక్సీవాలా రఫ్ కాపీ ముందే బయటికి వచ్చేయడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే.
వీటి మూలాలు ఎవరూ పసిగట్టలేకపోతున్నారు. థియేటర్లకు వచ్చాక పైరసీ జరిగితే అదో రకం. కానీ ఇలా విడుదలకు ముందు అంటే మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం చాలా ఉంది. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి అగ్ర దర్శకులు ఇలాంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఫోటో లీక్ వచ్చినా కాపీ రైట్స్ వేసి తీయించేస్తారు.
ఇకపై చిన్న సినిమాలు కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడిటింగ్ రూమ్ నుంచి ల్యాబ్ దాకా ప్రతిదీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ ఉండాలి. లేదంటే ఎక్కడో చెన్నైలో ఉన్న వాడు హైదరాబాద్ లో ఉన్న నిర్మాతను బెదిరించడం ఏమిటి. ఎలాగైనా సరే దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఇండస్ట్రీ, ప్రభుత్వాలు పూనుకోవాలి.
This post was last modified on February 28, 2026 1:56 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…