బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ ముగిసిపోయింది. అందరి అంచనాలకు తగ్గట్లే అభిజిత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. ఈ విషయంలో నిజానికి పెద్ద ఉత్కంఠేమీ లేదు. కానీ వారం ముందు నుంచి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు నడిచాయి. ఒక దశలో తొలిసారి లేడీ కంటెస్టెంట్ విజేతగా నిలవబోతోందని.. అరియానా టైటిల్ విన్నర్ అని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరికి అభిజితే విజేతగా నిలిచాడు.
టాప్-2లో తనతో పాటు నిలిచిన అఖిల్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. సోహైల్ మూడో స్థానంలో నిలిచాడు. అరియానా, హారిక తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. అభిజిత్ మెజారిటీ బిగ్ బాస్ ఫాలోవర్ల అభిమానం పొందాడన్నది స్పష్టం. ఐతే ఫైనల్ రోజు మాత్రం అతణ్ని మించి హైలైట్ అయిపోయాడు సోహైల్. తన చర్యలతో, మంచి మనసుతో అతను అందరి మనసు దోచేశాడు.
ఫైనల్ పోటీ నుంచి తప్పుకుని నిష్క్రమించేట్లయితే రూ.25 లక్షలు దక్కుతాయని నాగార్జున చెప్పగా.. అతను అందుకు అంగీకరించాడు. ఐతే ఆ 25 లక్షల ప్రైజ్ మనీలో పది లక్షలు అనాథాశ్రమానికి ఇస్తానని అతను ప్రకటించడం విశేషం. సోహైల్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అతడికి డబ్బు చాలా అవసరం అయినప్పటికీ అతను తనకు వచ్చే 40 శాతం అనాథాశ్రమానికి ఇచ్చేయడానికి సిద్ధపడటం గొప్ప విషయమే. అంతే కాదు.. ఇంకో ఐదు లక్షలు బిగ్ బాస్ హౌస్లో తనకు అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన మెహబూబ్కు ఇవ్వడానికి అతను సిద్ధపడ్డాడు.
ఐతే మెహబూబ్ తనకా డబ్బు వద్దని, దాన్ని కూడా అనాథాశ్రమానికే ఇచ్చేస్తానని అన్నాడు. వీరి స్పందనకు ఫిదా అయిన నాగ్.. వాళ్లిద్దరూ తమ డబ్బును ఇవ్వాల్సిన పని లేదని.. తానే రూ.10 లక్షలు వారి తరఫున అనాథాశ్రమానికి ఇస్తానని అన్నాడు. తర్వాత ట్రోఫీ ప్రెజెంటేషన్ కోసం ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి ఈ విషయం తెలిసి సోహైల్ తరఫున తాను రూ.10 లక్షలు అనాథాశ్రామానికి ఇస్తానంటూ అప్పటికప్పుడు చెక్కు రాసి ఇచ్చేయడం విశేషం. ఈ మొత్తం వ్యవహారానికి నాంది పలికిన సోహైల్ హీరోగా నిలిచాడు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…