థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలంతా సినిమాలు విడుదల చేయకుండా దాచి పెట్టుకుంటే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను థియేటర్లలో వదులుతున్నారు. క్రిస్మస్ రోజున ఈ చిత్రం థియేటర్లలో రానుంది. ఈ చిత్రానికి నిర్మాత రిస్క్ అయ్యేదేమీ లేదు… ఎందుకంటే జీ5 భారీ మొత్తానికి రైట్స్ అన్నీ కొనేసుకుంది. వారి నుంచి థియేటర్స్ రైట్స్ని దిల్ రాజు, యువి వాళ్లు తీసుకున్నారు. వారు చేసిన రిస్క్ ఎంతవరకు పే చేస్తుందనేదే ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆడియన్స్ రావడం, రాకపోవడం మాట అటుంచితే, ఈ చిత్రాన్ని సోలోగా రిలీజ్ చేయడం వల్ల అందుబాటులో వున్న థియేటర్లన్నీ ఈ చిత్రానికే దక్కుతున్నాయి. మామూలుగా బడా హీరోలకు తప్ప దొరకని బెస్ట్ థియేటర్లు ఈ చిత్రం ప్రదర్శించబోతున్నాయి. అలా సాయి ధరమ్ తేజ్ సినిమాకి ఈ సోలో రిలీజ్ చాలా ప్లస్ అవనుంది. సినిమా ఎలాగుందీ, సోమవారం తర్వాత నిలబడుతుందా అనేది రిలీజ్ అయితే తెలుస్తాయి కానీ మొదటి వారాంతం వరకు ఢోకా వుండదనే అనిపిస్తోంది. అఫ్కోర్స్ డిజాస్టర్ టాక్ వస్తే ఎవరూ ఏమీ చేయలేరనుకోండి. అది వేరే సంగతి. కానీ ట్రెయిలర్ చూస్తే మాత్రం మినిమం గ్యారెంటీ సినిమా అనే అనిపిస్తోంది.
This post was last modified on December 20, 2020 12:32 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…