థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలంతా సినిమాలు విడుదల చేయకుండా దాచి పెట్టుకుంటే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను థియేటర్లలో వదులుతున్నారు. క్రిస్మస్ రోజున ఈ చిత్రం థియేటర్లలో రానుంది. ఈ చిత్రానికి నిర్మాత రిస్క్ అయ్యేదేమీ లేదు… ఎందుకంటే జీ5 భారీ మొత్తానికి రైట్స్ అన్నీ కొనేసుకుంది. వారి నుంచి థియేటర్స్ రైట్స్ని దిల్ రాజు, యువి వాళ్లు తీసుకున్నారు. వారు చేసిన రిస్క్ ఎంతవరకు పే చేస్తుందనేదే ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆడియన్స్ రావడం, రాకపోవడం మాట అటుంచితే, ఈ చిత్రాన్ని సోలోగా రిలీజ్ చేయడం వల్ల అందుబాటులో వున్న థియేటర్లన్నీ ఈ చిత్రానికే దక్కుతున్నాయి. మామూలుగా బడా హీరోలకు తప్ప దొరకని బెస్ట్ థియేటర్లు ఈ చిత్రం ప్రదర్శించబోతున్నాయి. అలా సాయి ధరమ్ తేజ్ సినిమాకి ఈ సోలో రిలీజ్ చాలా ప్లస్ అవనుంది. సినిమా ఎలాగుందీ, సోమవారం తర్వాత నిలబడుతుందా అనేది రిలీజ్ అయితే తెలుస్తాయి కానీ మొదటి వారాంతం వరకు ఢోకా వుండదనే అనిపిస్తోంది. అఫ్కోర్స్ డిజాస్టర్ టాక్ వస్తే ఎవరూ ఏమీ చేయలేరనుకోండి. అది వేరే సంగతి. కానీ ట్రెయిలర్ చూస్తే మాత్రం మినిమం గ్యారెంటీ సినిమా అనే అనిపిస్తోంది.
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…