థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలంతా సినిమాలు విడుదల చేయకుండా దాచి పెట్టుకుంటే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను థియేటర్లలో వదులుతున్నారు. క్రిస్మస్ రోజున ఈ చిత్రం థియేటర్లలో రానుంది. ఈ చిత్రానికి నిర్మాత రిస్క్ అయ్యేదేమీ లేదు… ఎందుకంటే జీ5 భారీ మొత్తానికి రైట్స్ అన్నీ కొనేసుకుంది. వారి నుంచి థియేటర్స్ రైట్స్ని దిల్ రాజు, యువి వాళ్లు తీసుకున్నారు. వారు చేసిన రిస్క్ ఎంతవరకు పే చేస్తుందనేదే ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆడియన్స్ రావడం, రాకపోవడం మాట అటుంచితే, ఈ చిత్రాన్ని సోలోగా రిలీజ్ చేయడం వల్ల అందుబాటులో వున్న థియేటర్లన్నీ ఈ చిత్రానికే దక్కుతున్నాయి. మామూలుగా బడా హీరోలకు తప్ప దొరకని బెస్ట్ థియేటర్లు ఈ చిత్రం ప్రదర్శించబోతున్నాయి. అలా సాయి ధరమ్ తేజ్ సినిమాకి ఈ సోలో రిలీజ్ చాలా ప్లస్ అవనుంది. సినిమా ఎలాగుందీ, సోమవారం తర్వాత నిలబడుతుందా అనేది రిలీజ్ అయితే తెలుస్తాయి కానీ మొదటి వారాంతం వరకు ఢోకా వుండదనే అనిపిస్తోంది. అఫ్కోర్స్ డిజాస్టర్ టాక్ వస్తే ఎవరూ ఏమీ చేయలేరనుకోండి. అది వేరే సంగతి. కానీ ట్రెయిలర్ చూస్తే మాత్రం మినిమం గ్యారెంటీ సినిమా అనే అనిపిస్తోంది.
This post was last modified on December 20, 2020 12:32 am
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…