థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలంతా సినిమాలు విడుదల చేయకుండా దాచి పెట్టుకుంటే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను థియేటర్లలో వదులుతున్నారు. క్రిస్మస్ రోజున ఈ చిత్రం థియేటర్లలో రానుంది. ఈ చిత్రానికి నిర్మాత రిస్క్ అయ్యేదేమీ లేదు… ఎందుకంటే జీ5 భారీ మొత్తానికి రైట్స్ అన్నీ కొనేసుకుంది. వారి నుంచి థియేటర్స్ రైట్స్ని దిల్ రాజు, యువి వాళ్లు తీసుకున్నారు. వారు చేసిన రిస్క్ ఎంతవరకు పే చేస్తుందనేదే ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆడియన్స్ రావడం, రాకపోవడం మాట అటుంచితే, ఈ చిత్రాన్ని సోలోగా రిలీజ్ చేయడం వల్ల అందుబాటులో వున్న థియేటర్లన్నీ ఈ చిత్రానికే దక్కుతున్నాయి. మామూలుగా బడా హీరోలకు తప్ప దొరకని బెస్ట్ థియేటర్లు ఈ చిత్రం ప్రదర్శించబోతున్నాయి. అలా సాయి ధరమ్ తేజ్ సినిమాకి ఈ సోలో రిలీజ్ చాలా ప్లస్ అవనుంది. సినిమా ఎలాగుందీ, సోమవారం తర్వాత నిలబడుతుందా అనేది రిలీజ్ అయితే తెలుస్తాయి కానీ మొదటి వారాంతం వరకు ఢోకా వుండదనే అనిపిస్తోంది. అఫ్కోర్స్ డిజాస్టర్ టాక్ వస్తే ఎవరూ ఏమీ చేయలేరనుకోండి. అది వేరే సంగతి. కానీ ట్రెయిలర్ చూస్తే మాత్రం మినిమం గ్యారెంటీ సినిమా అనే అనిపిస్తోంది.
This post was last modified on December 20, 2020 12:32 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…