రెండేళ్ల కిందట రంగస్థలంతో నాన్ బాహుబలి హిట్టు కొట్టి తిరుగులేని స్థాయిని అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఐతే ఆ సినిమాతో చరణ్ ప్రయోగం చేయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన చిత్రం ధృవ. ఆ చిత్రానికి ముందు చరణ్ పరిస్థితి ఏమీ బాగా లేదు. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్ లీ సినిమాలు ఫెయిలై నిరాశలో ఉన్నాడు. అతడి కాన్ఫిడెన్స్ కూడా దెబ్బ తినేసింది. మరీ రొడ్డ కొట్టుడు సినిమాలు చేస్తున్నాడన్న ముద్ర కూడా పడిపోయింది.
అలాంటి సమయంలో చరణ్ తన శైలికి భిన్నమైన థ్రిల్లర్ మూవీ ధృవలో నటించాడు. అది చరణ్ను సరికొత్తగా ప్రెజెంట్ చేసింది. అతను కొత్త కథలకు సూటవుతాడని, భిన్నంగా నటించగలడని ఆ సినిమాతోనే రుజువైంది. ఈ చిత్రానికి మాతృక అయిన తనీ ఒరువన్తో తమిళంలో సంచలనం సృష్టించిన దర్శకుడు మోహన్ రాజా.
రీమేక్లకు పేరుపడ్డ మోహన్ రాజా.. తనీ ఒరువన్తో తన సత్తా ఏంటో చూపించాడు. ఈ సినిమాతో పరోక్షంగా రామ్ చరణ్ కెరీర్కూ అతను ఉపయోగపడ్డాడు. తనీ ఒరువన్ తర్వాత వేలైక్కారన్ అనే మరో సినిమాతోనూ మెప్పించిన మోహన్.. ఇప్పుడు అనుకోకుండా తెలుగులో ఓ రీమేక్ సినిమా తీయబోతున్నాడు. అది మెగాస్టార్ హీరోగా నటించనున్న లూసిఫర్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తనీ ఒరువన్ ద్వారా చరణ్కు ఉపయోగపడ్డ మోహన్.. లూసిఫర్ రీమేక్కు దర్శకుడిని తేల్చుకోలేక సతమతం అవుతున్న చిరుకు సమాధానంగా నిలిచాడు. ఈ సినిమాకు మోహన్ను రెకమండ్ చేసింది చరణే అంటున్నారు.
చాలామంది ఈ రీమేక్లో నటించొద్దని చిరుకు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఆ చిత్రాన్ని తనదైన శైలిలో మలిచి చిరు ఈ రీమేక్లో నటించడం కరెక్టే అని రుజువు చేయాల్సిన బాధ్యత మోహన్ రాజాపై ఉంది. ఇంతకుముందు కొడుక్కి సాయం చేసిన మోహన్ రాజా.. ఇప్పుడు తండ్రికి ఏమేర ఉపయోగపడతాడో చూడాలి.
This post was last modified on December 19, 2020 8:09 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…