తమిళంలో గత దశాబ్ద కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో విక్రమ్ వేద ఒకటి. భార్యాభర్తలైన పుష్కర్-గాయత్రి ఉమ్మడిగా దర్శకత్వం వహించిన ఈ నియో నాయిర్ థ్రిల్లర్.. అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆసక్తికరమైన కథ.. ఉత్కంఠ భరిత స్క్రీన్ ప్లేతో ఈ సినిమా క్రిటిక్స్ను కూడా మెప్పించింది.
ఈ సినిమా రీమేక్ కోసం వివిధ భాషల నుంచి ప్రయత్నాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. తెలుగులో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ దాని సంగతి ఎటూ తేలలేదు. ఐతే హిందీలో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే.. విక్రమ్ వేద రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు. ఒరిజినల్లో మాధవన్ చేసిన పోలీస్ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ను ఎంచుకున్నాడు. ఐతే ఈ సినిమాలో మేజర్ హైలైట్ అయిన విజయ్ సేతుపతి పాత్ర సంగతే ఎటూ తేలకుండా ఉంది.
ఈ ఏడాది ఆరంభంలో ఆమిర్ ఖాన్ సేతుపతి చేసిన గ్యాంగ్ స్టర్ పాత్రకు ఖరారైనట్లు వార్తలొచ్చాయి. మార్చిలో షూటింగ్ మొదలవుతుందని.. లాల్ సింగ్ చద్దాతో పాటే ఆమిర్ ఈ సినిమాలో కూడా నటిస్తాడని అన్నారు. కానీ ఇంతలో కరోనా వచ్చింది. అన్ని సినిమాల్లాగే దీనికీ బ్రేక్ పడింది. లాక్ డౌన్ తర్వాత ఆమిర్ లాల్ సింగ్ చద్దా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.
త్వరలో అది పూర్తి చేసి విక్రమ్ వేద రీమేక్లో నటిస్తాడని అనుకుంటే.. ఇప్పుడేమో అతనీ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. స్క్రిప్టు నచ్చక తప్పుకున్నాడా.. పాత్ర సూటవదనుకున్నాడా.. డేట్లు సర్దుబాటు చేయలేకపోయాడా.. కారణమేంటో కానీ ఆమిర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం మేకర్స్కు రుచించనిదే. మాతృకను కూడా ఒరిజినల్ తీసిన పుష్కర్, గాయత్రినే డైరెక్ట్ చేయబోతున్నారు. మరి ఆమిర్ స్థానంలోకి ఎవరిని తెస్తారో చూడాలి.
This post was last modified on December 19, 2020 7:57 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…