టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ పేరు వినగానే ఒకప్పటి మనసుకు హత్తుకునే ప్రేమకథలే గుర్తొస్తాయి. ఇక దాదాపు 25 ఏళ్ల క్రితం ‘మనసంతా నువ్వే’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే క్లాసిక్ లవ్ స్టోరీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మళ్ళీ వస్తోంది. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్ సినిమా ప్రమోషన్స్ కోసం స్వయంగా రంగంలోకి దిగడం విశేషం.
ఇటీవల ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేయగా, ఇప్పుడు ఆయన మేనకోడలు మహతి కూడా ముందుకొచ్చారు. 25 ఏళ్ల తర్వాత మా మామ సినిమా మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూడటం చాలా గర్వంగా ఉందని ఆమె ఒక వీడియో బైట్ ఇచ్చారు. చిన్నప్పుడు ఉదయ్ కిరణ్ సినిమాలను థియేటర్లో చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.
వరుసగా హీరో మేనల్లుడు, మేనకోడలు ఇద్దరూ ప్రమోషన్స్ లో పాల్గొంటుండటంతో ఉదయ్ కిరణ్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఉదయ్ కిరణ్ సినీ ప్రయాణం అర్థాంతరంగా ముగిసినా, ఆయన సినిమాలను గుండెల్లో పెట్టుకున్న వారు ఇప్పటికీ కోట్లలో ఉన్నారు. వారి కోరిక మేరకే మేకర్స్ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ తో ఈ ఈవెంట్ కి ఇప్పుడు మరింత బజ్ వచ్చింది.
ఫిబ్రవరి 14న థియేటర్లలో ‘మనసంతా నువ్వే’ పాటలు మళ్ళీ మార్మోగబోతున్నాయి. ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్, ఎం.ఎస్. రాజు మేకింగ్ ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తాయి. ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అవుతున్నా, వాలెంటైన్స్ డే కావడంతో యూత్ ఈ సినిమాకు ఎంత వరకు కనెక్ట్ అవుతారో చూడాలి.
ఇక ఉదయ్ కిరణ్ సినిమాల్లో ఉండే ఆ అమాయకత్వం, సున్నితమైన కథలు ఇప్పటికీ మిస్ అవుతున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మనసంతా నువ్వే రీ రిలీజ్ రోజున థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడతాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మరి ఫ్యాన్స్ ఏ స్థాయిలో సక్సెస్ చేస్తారో చూడాలి.
This post was last modified on February 11, 2026 6:25 pm
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు…
వైసీపీ నేతలు, ఆ పార్టీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా రెండు…
‘బాహుబలి’తో ప్రభాస్ ఎంత పెద్ద స్టార్గా ఎదిగాడో.. ఒకేసారి తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎన్ని రెట్లయిందో కొత్తగా చెప్పాల్సిన…
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటూ చాలామంది సినీ జనాలు చెబుతుంటారు. ఐతే యాక్టర్ అయ్యాక డాక్టర్ అయిన వాళ్లు…
కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. రాహుల్…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ ఎప్పటిలాగే బాయ్ కాట్ చేసింది. అటెండెన్స్ టార్గెట్ గా సభకు వచ్చిన వైసీపీ…