యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సీత పయనం ఈ వారం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. కూతురు ఐశ్వర్యని టాలీవుడ్ కు పరిచయం చేసే ఉద్దేశంతో తీసిన ఈ మూవీకి సర్వం ఆయనే ప్రమోషన్ బాధ్యతలు తీసుకుని ప్రతి చోటా కనిపిస్తున్నారు.
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరోలను తీసుకురాకుండా, నిజ జీవితంలో సామాన్యులకు జీవితాలను ప్రసాదిస్తున్న ముగ్గురు గొప్ప వ్యక్తులను గెస్టులుగా సత్కరించడం ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మానందం అంతటి వారే వాళ్ళకు పాదాభివందనం చేసేందుకు వెనుకాడలేదంటే ఎంత మహోన్నతంగా ఆలోచించారో అర్థం చేసుకోవచ్చు.
ఇదే కాదు పలు ఇంటర్వ్యూలలో అర్జున్ ఓపిగ్గా చెబుతున్న సమాధానాలు నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇదే సినిమాని గతంలో విశ్వక్ సేన్ తో ప్రారంభించి, తర్వాత విభేదాలు రావడం వల్ల హీరోని మార్చిన సంగతి తెలిసిందే.
ఇదే ప్రశ్న ఎదురైనప్పుడు విశ్వక్ చాలా చిన్న వాడు, ఏదో జరిగిపోయింది, దాన్ని పట్టుకుని వేలాడలేం, అతని సినిమా బాగా ఆడాలి, మాది కూడా ఆడాలి అంటూ చెప్పిన వైనంలో అర్జున్ అనుభవంలోని గొప్పదనాన్ని చెప్పకనే చెబుతోంది. పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇచ్చిన అర్జున్ సినిమాతో పాటు తన జీవిత విశేషాలు చాలానే పంచుకున్నాడు.
అయితే ఇదంతా సీత పయనంకు ఓపెనింగ్స్ తెచ్చేందుకు దోహదం చేస్తుందా అంటే నూటికి నూరు శాతం అని చెప్పలేం కానీ కొంత మేర సానుకూల ప్రభావం అయితే ఉంటుంది. కాకపోతే టాక్ పాజిటివ్ గా రావాలి. పోటీలో ఉన్న ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ రెండూ ఎక్కువ యూత్ ని టార్గెట్ చేసుకున్నాయి.
సో మొదటి రోజు వాళ్ళు అటువైపు షిఫ్ట్ అవుతారు. సీత పయనం ఆకట్టుకోవాల్సింది ఫ్యామిలీ ఆడియన్సుని. మరి అర్జున్ ఇందులో ఏ మేరకు సఫలీకృతం అవుతారో ప్రేమికుల రోజు తేలనుంది. ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించిన ఈ రోడ్ జర్నీ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.
This post was last modified on February 11, 2026 2:19 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఏదో ఒక అడ్డంకి ఎదురు కావడం కామన్ అయిపోయింది. పవన్ ప్రతిపక్షంలో ఉండగా…
టాక్సిక్ తప్పుకుని మార్చి 19 ఉస్తాద్ భగత్ సింగ్ రావడం కన్ఫర్మ్ అయ్యాక ఇప్పుడు డెకాయిట్ గురించిన చర్చ మూవీ…
గత ఏడాది తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఈసారి వృషకర్మగా రాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్…
ఫిబ్రవరి మొత్తం దాదాపుగా డ్రైగా గడిపేసిన టాలీవుడ్ బాక్సాఫీస్ మార్చిలో మంచి బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఎంత పిల్లల…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వచ్చే ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరి పోరు చేస్తామంటూ..…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్…