యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సీత పయనం ఈ వారం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. కూతురు ఐశ్వర్యని టాలీవుడ్ కు పరిచయం చేసే ఉద్దేశంతో తీసిన ఈ మూవీకి సర్వం ఆయనే ప్రమోషన్ బాధ్యతలు తీసుకుని ప్రతి చోటా కనిపిస్తున్నారు.
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరోలను తీసుకురాకుండా, నిజ జీవితంలో సామాన్యులకు జీవితాలను ప్రసాదిస్తున్న ముగ్గురు గొప్ప వ్యక్తులను గెస్టులుగా సత్కరించడం ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మానందం అంతటి వారే వాళ్ళకు పాదాభివందనం చేసేందుకు వెనుకాడలేదంటే ఎంత మహోన్నతంగా ఆలోచించారో అర్థం చేసుకోవచ్చు.
ఇదే కాదు పలు ఇంటర్వ్యూలలో అర్జున్ ఓపిగ్గా చెబుతున్న సమాధానాలు నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇదే సినిమాని గతంలో విశ్వక్ సేన్ తో ప్రారంభించి, తర్వాత విభేదాలు రావడం వల్ల హీరోని మార్చిన సంగతి తెలిసిందే.
ఇదే ప్రశ్న ఎదురైనప్పుడు విశ్వక్ చాలా చిన్న వాడు, ఏదో జరిగిపోయింది, దాన్ని పట్టుకుని వేలాడలేం, అతని సినిమా బాగా ఆడాలి, మాది కూడా ఆడాలి అంటూ చెప్పిన వైనంలో అర్జున్ అనుభవంలోని గొప్పదనాన్ని చెప్పకనే చెబుతోంది. పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇచ్చిన అర్జున్ సినిమాతో పాటు తన జీవిత విశేషాలు చాలానే పంచుకున్నాడు.
అయితే ఇదంతా సీత పయనంకు ఓపెనింగ్స్ తెచ్చేందుకు దోహదం చేస్తుందా అంటే నూటికి నూరు శాతం అని చెప్పలేం కానీ కొంత మేర సానుకూల ప్రభావం అయితే ఉంటుంది. కాకపోతే టాక్ పాజిటివ్ గా రావాలి. పోటీలో ఉన్న ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ రెండూ ఎక్కువ యూత్ ని టార్గెట్ చేసుకున్నాయి.
సో మొదటి రోజు వాళ్ళు అటువైపు షిఫ్ట్ అవుతారు. సీత పయనం ఆకట్టుకోవాల్సింది ఫ్యామిలీ ఆడియన్సుని. మరి అర్జున్ ఇందులో ఏ మేరకు సఫలీకృతం అవుతారో ప్రేమికుల రోజు తేలనుంది. ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించిన ఈ రోడ్ జర్నీ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.
This post was last modified on February 11, 2026 2:19 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…