తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు బిజినెస్ పరంగా అత్యంత కీలకమైన నైజాం ఏరియాలో కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తెరపైకి రావడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ప్రొడక్షన్కే పరిమితం అవుతూ, ఎప్పుడో ఒకసారి వేరే సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ.. పూర్తి స్థాయిలో పంపిణీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
ఒకేసారి ఆ సంస్థ దాదాపు అరడజను సినిమాలను నైజాంలో రిలీజ్ చేసే దిశగా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడైంది. ఇంకో రెండు మూడు సంస్థలు నైజాం డిస్ట్రిబ్యూషన్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో ధీరజ్ మొగిలినేని సంస్థ కూడా ఒకటి. అతను కపుల్ ఫ్రెండ్లీ సినిమాను నైజాంలో పంపిణీ చేస్తున్నాడు.
ఇందుకోసం ఆఫీస్ కూడా మొదలుపెట్టాడు. దిల్ రాజు అండ్ కోకు చెక్ పెట్టడానికి, ఏకఛత్రాధిపత్యాన్ని అరికట్టడానికి, అలాగే డిస్ట్రిబ్యూషన్లో తలెత్తుతున్న ఇబ్బందులు, మోసాలను అధిగమించడానికే ఇండస్ట్రీలో పలువురు నిర్మాతలు మాట్లాడుకుని సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు తెరుస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ధీరజ్ మొగిలినేని కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రమోషన్లలో స్పందించాడు. తాను సుహృద్భావ వాతావరణంలోనే సొంత డిస్ట్రిబ్యూట్ ఆఫీస్ మొదలుపెట్టినట్లు చెప్పాడు. తనకు దిల్ రాజు, శిరీష్ 20 ఏళ్లుగా తెలుసని, వారితో మంచి అనుబంధం ఉందని.. ఇలా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరుస్తున్నానని చెబితే, మంచిదే చేయమని వారు తనను ప్రోత్సహించారని చెప్పాడు ధీరజ్.
ఇక తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నింటినీ అల్లు అరవింద్ భాగస్వామ్యంతోనే చేశానని, ఆయనా తనకు మద్దతుగా ఉన్నారని చెప్పాడు. సురేష్ బాబు సైతం తనకు అండగానే నిలిచారన్నాడు.
నైజాం డిస్ట్రిబ్యూటర్లకు బాగా డబ్బులొచ్చే ఏరియా అని, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే నాలుగు డబ్బులు తినొచ్చనే ఉద్దేశంతోనే ఇందులోకి దిగానని.. అంతే తప్ప ఎవరికీ పోటీ కాదని, ఎవరితోనూ తనకు గొడవలు లేవని స్పష్టం చేశాడు ధీరజ్. కపుల్ ఫ్రెండ్లీ సినిమా మీద నమ్మకంతో నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానని.. ఈ సినిమా తనకు మంచి ఫలితాన్నిస్తుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.
This post was last modified on February 11, 2026 8:39 am
Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…