ఒకప్పుడు టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉండేవాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు టాలీవుడ్ అనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగులో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ.. ‘పుష్ప’ సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతి పెద్ద విజయాల్లో ఒకటనదగ్గ స్థాయి హిట్ కొట్టాడు. దీంతో తన రేంజ్ మారిపోయింది. అందుకు తగ్గట్లే పీఆర్ బలాన్ని కూడా పెంచుకున్నాడు.
బన్నీ కోసం పదుల సంఖ్యలో పీఆర్ టీమ్స్ పని చేస్తుంటాయని అందరికీ తెలుసు. అలాగే అభిమాన సంఘాలను కూడా పకడ్బందీగా మెయింటైన్ చేస్తుంటారు. వీటిని మెయింటైన్ చేయడానికే లక్షల్లో ఖర్చు చేస్తారన్నది కూడా బహిరంగ రహస్యమే. బన్నీ చుట్టూ పీఆర్ వలయం ఎలా ఉంటుంది.. మీడియా వాళ్లు కలిసినా ఎన్ని రూల్స్ పెడతారు అన్నది బాలీవుడ్ బ్రాండ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కావేరి బరువా ఒక పాడ్కాస్ట్లో వెల్లడించారు.
బన్నీని కలవాలంటే డూస్ అండ్ డోంట్స్ అంటూ 40 పాయింట్లతో లిస్టు ఉంటుందని ఆమె చెప్పడం విశేషం. ‘‘నా కెరీర్లో ఇంట్రెస్టింగ్ మీటింగ్స్లో అల్లు అర్జున్తో జరిగింది ఒకటి. ఆయన హైదరాబాద్ మెగాస్టార్. సౌత్ ఇండియన్ స్టార్ హీరోలకు పరివారం చాలా పెద్దగా ఉంటుంది. ఆయన్ని కలవడానికి ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటూ 40 పాయింట్లతో ఒక లిస్ట్ ఇచ్చారు.
ఆయన మేనేజర్కు మేనేజర్, తన కింద ఇంకో మేనేజర్.. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్లు చాలా కండిషన్లు పెట్టారు. సార్ కళ్లలోకి చూడకూడదు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఆయన్ని ఎప్పుడూ సార్ అనే అనాలి’’ అంటూ లిస్టు చదివారు కావేరి బరువా. ఎందుకు ఈ రూల్స్ అన్ని అని ఇంటర్వ్యూయర్ అడిగితే నాకేం తెలుసు అన్నారు కావేరీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బన్నీని కలవాలంటే ఇన్ని రూల్సా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూసి. కానీ బన్నీ అభిమానులను ఎంత హుందాగా దగ్గరకు తీసుకుంటాడో అంటున్న అభిమానులు తమ ఫోటోలు షేర్ చేస్తూ ఇదొక నెగెటివిటీ స్టంట్ అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ విషయంపై బన్నీ టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
This post was last modified on February 10, 2026 5:12 pm
ఫిబ్రవరి మొత్తం దాదాపుగా డ్రైగా గడిపేసిన టాలీవుడ్ బాక్సాఫీస్ మార్చిలో మంచి బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఎంత పిల్లల…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వచ్చే ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరి పోరు చేస్తామంటూ..…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో…
హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే..…