ఒకప్పుడు టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉండేవాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు టాలీవుడ్ అనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగులో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ.. ‘పుష్ప’ సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతి పెద్ద విజయాల్లో ఒకటనదగ్గ స్థాయి హిట్ కొట్టాడు. దీంతో తన రేంజ్ మారిపోయింది. అందుకు తగ్గట్లే పీఆర్ బలాన్ని కూడా పెంచుకున్నాడు.
బన్నీ కోసం పదుల సంఖ్యలో పీఆర్ టీమ్స్ పని చేస్తుంటాయని అందరికీ తెలుసు. అలాగే అభిమాన సంఘాలను కూడా పకడ్బందీగా మెయింటైన్ చేస్తుంటారు. వీటిని మెయింటైన్ చేయడానికే లక్షల్లో ఖర్చు చేస్తారన్నది కూడా బహిరంగ రహస్యమే. బన్నీ చుట్టూ పీఆర్ వలయం ఎలా ఉంటుంది.. మీడియా వాళ్లు కలిసినా ఎన్ని రూల్స్ పెడతారు అన్నది బాలీవుడ్ బ్రాండ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కావేరి బరువా ఒక పాడ్కాస్ట్లో వెల్లడించారు.
బన్నీని కలవాలంటే డూస్ అండ్ డోంట్స్ అంటూ 40 పాయింట్లతో లిస్టు ఉంటుందని ఆమె చెప్పడం విశేషం. ‘‘నా కెరీర్లో ఇంట్రెస్టింగ్ మీటింగ్స్లో అల్లు అర్జున్తో జరిగింది ఒకటి. ఆయన హైదరాబాద్ మెగాస్టార్. సౌత్ ఇండియన్ స్టార్ హీరోలకు పరివారం చాలా పెద్దగా ఉంటుంది. ఆయన్ని కలవడానికి ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటూ 40 పాయింట్లతో ఒక లిస్ట్ ఇచ్చారు.
ఆయన మేనేజర్కు మేనేజర్, తన కింద ఇంకో మేనేజర్.. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్లు చాలా కండిషన్లు పెట్టారు. సార్ కళ్లలోకి చూడకూడదు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఆయన్ని ఎప్పుడూ సార్ అనే అనాలి’’ అంటూ లిస్టు చదివారు కావేరి బరువా. ఎందుకు ఈ రూల్స్ అన్ని అని ఇంటర్వ్యూయర్ అడిగితే నాకేం తెలుసు అన్నారు కావేరీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బన్నీని కలవాలంటే ఇన్ని రూల్సా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూసి. కానీ బన్నీ అభిమానులను ఎంత హుందాగా దగ్గరకు తీసుకుంటాడో అంటున్న అభిమానులు తమ ఫోటోలు షేర్ చేస్తూ ఇదొక నెగెటివిటీ స్టంట్ అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ విషయంపై బన్నీ టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
This post was last modified on February 10, 2026 5:12 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…