దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మ మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అయితే క్యాస్టింగ్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్ ఉండటంతో ఇంకా సెట్స్ లో పూర్తి స్థాయిలో అడుగు పెట్టలేదు.
చాలా కీలకమైన విలన్ పాత్ర కోసం నటనకు దూరంగా ఉన్న వింటేజ్ హీరోని ట్రై చేసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ముందు వరసలో వడ్డే నవీన్ పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు కోరుకున్న ప్రియుడు, పెళ్లి, స్నేహితులు లాంటి సూపర్ హిట్లతో మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన నవీన్ వడ్డే తర్వాత వ్యాపారం వైపు షిఫ్ట్ అయిపోయాడు.
త్వరలోనే హీరోగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఇటీవలే అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అలాంటప్పుడు విలన్ పాత్రకు మొగ్గు చూపిస్తాడా అనేది అనుమానమే. పైగా అతనిది సాఫ్ట్ ఫేస్. నెగటివ్ క్యారెక్టర్లకు అంతగా సూట్ కాదు. హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడే ప్రేమించే మనసులో ఇలా ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. అందులో రవితేజ కూడా ఉంటాడు.
ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత జనం రిసీవ్ చేసుకోవడం అనుమానమే. చిరునవ్వుతో వేణు తొట్టెంపూడి ఆ మధ్య దమ్ము., రామారావు ఆన్ డ్యూటీలతో పునఃప్రవేశం చేసినా జనం పట్టించుకోలేదు. వరుణ్ సందేశ్ ఇప్పటికీ ఏదో ఒక సినిమాతో పోరాడుతూనే ఉన్నాడు.
మరి ఫైనల్ గా ఎల్లమ్మ విలన్ ఎవరవుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలంగాణ జానపద కళాకారుల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ డివోషనల్ కం ఫిక్షనల్ డ్రామాకు ఇంకా హీరోయిన్ ఎవరో ప్రకటించలేదు. పాటలు రికార్డింగ్ చేసి లాక్ చేసిన స్క్రిప్ట్ తో వేణు రెడీగా ఉన్నాడు.
ఒక్కసారి ఆర్టిస్టులు ఫైనల్ అయిపోతే చకచకా పరుగులు పెట్టించడమే ఉంటుంది. ఈ ఏడాది దసరా లేదా దీపావళి విడుదలను టార్గెట్ గా పెట్టుకుంటున్నారు కానీ ప్రొడక్షన్ కాస్ట్, విఎఫెక్స్ పనులు చూస్తుంటే అంత ఈజీగా అయ్యేలా లేదు. బలగం తర్వాత మూవీ కావడంతో వేణు యెల్దండికి బిగ్ లీగ్ లోకి ప్రవేశించడానికి ఎల్లమ్మ మంచి అవకాశం.
This post was last modified on February 8, 2026 11:21 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…