గత 25 ఏళ్లలో దక్షిణాదిన వచ్చిన ఉత్తమ ప్రేమకథల జాబితా తీస్తే.. అందులో ముందు వరుసలో గౌతమ్ మేనన్ సినిమాలే ఉంటాయి. ఆయన తొలి చిత్రం ‘చెలి’నే ఓ అందమైన ప్రేమకథ. ఆ తర్వాత ఓ వైపు ‘కాక్క కాక్క’, ‘వేట్టయాడు విలయాడు’ ‘రాఘవన్), ‘ఎన్నై అరిందాల్’ (ఎంతవాడుగానీ) లాంటి యాక్షన్ సినిమాలు తీస్తూనే.. ఇంకోవైపు విన్నైతాండి వరువాయ (ఏమాయ చేసావే), నీదానే యన్ పొన్ వసంతం (ఎటో వెళ్లిపోయింది మనసు), అచ్చం ఎన్బదు మదమైయిదా (సాహసం శ్వాసగా సాగిపో) లాంటి ప్రేమకథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.
గౌతమ్ లవ్ స్టోరీలు కొన్ని సరిగా ఆడకపోయి ఉండొచ్చు.. కానీ వాటిలో ఆయన క్లాస్ మాత్రం కనిపిస్తుంది. ఐతే ఈ విలక్షణ దర్శకుడు నిఖార్సయిన ప్రేమకథ తీసి చాలా రోజులైపోయింది. అసలాయన సినిమాలు తీయడమే తగ్గించేశారు. ఐతే ఇప్పుడు మళ్లీ తన మార్కు లవ్ స్టోరీ తీయాలని అనుకుంటున్నాడట గౌతమ్. దీనికి సరైన ఆర్టిస్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు గౌతమ్.
మళ్లీ మనసు పెట్టి ఒక ప్రేమకథను రాసినట్లు గౌతమ్ వెల్లడించాడు. ఐతే ఒకప్పట్లా స్టార్ హీరోలు ఇప్పుడు ప్రేమకథలు చేయట్లేదని.. కాబట్టి తన ప్రేమకథకు ఆర్టిస్టులను ఎంచుకోవడం కష్టంగా ఉందని గౌతమ్ అన్నాడు. ఈ కథ ఎవరిని ఎంచుకుంటుందో చూడాలని చెప్పాడు.
తన సినిమాలు కొన్ని ఫ్లాప్ కావడం గురించి గౌతమ్ మాట్లాడుతూ.. తాను వేరే నిర్మాతలకు చేసిన సినిమాల్లో ఏదీ దాదాపుగా నష్టాలు తెచ్చిపెట్టలేదని గౌతమ్ స్పష్టం చేశాడు. తాను సొంతంగా ప్రొడ్యూస్ చేసిన సినిమాలే సరిగా ఆడలేదన్నాడు. ధనుష్తో తీసిన ‘ఎన్నై నోకి పాయుం తోటా’ ఎక్కువ నష్టం మిగిల్చిందన్నాడు గౌతమ్.
సరదా కోసమే నటుడిగా సినిమాలు చేస్తూ వచ్చానని.. ఇప్పుడు బ్రేక్ తీసుకుని వరుసగా సినిమాలు డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు గౌతమ్. సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్తో తనకు గొప్ప అనుబంధం ఉందని.. తన పాటల్లో సగానికి పైగా అతనే కంపోజ్ చేశాడని చెప్పిన గౌతమ్.. ఒక్క ‘నడునిసి నాయిగల్’ (ఎర్ర గులాబీలు) చిత్రంలో మాత్రమే పాటలు లేకుండా ప్రయోగం చేశానని.. అది ఫలితాన్నివ్వలేదని అన్నాడు.
గౌతమ్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందిన ‘ధ్రువనక్షత్రం’ చాలా ఏళ్లుగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ఈ చిత్రాన్ని బయటికి తీసుకురావడానికి మరోసారి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు గౌతమ్.
This post was last modified on February 8, 2026 12:36 pm
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన…
వరుణ్ తేజ్ హీరోగా యుదు వంశీ దర్శకత్వం వహించే బరి షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమయ్యింది. నీహారిక కొణిదెల నిర్మాత…
మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే అనే ముందుచూపు చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనం అని వైయస్ షర్మిల…
అదేంటి దురంధర్ లో మంత్రి జమీల్ జమాలికి మన టాలీవుడ్ చిరంజీవి, రవితేజకు కనెక్షన్ ఏమనుకుంటున్నారా. కొన్ని సినిమా సంగతులు…
గుంటూరు తూర్పు.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చకు వస్తున్న నియోజకవర్గం ఇదే!. అయితే.. దీనిపైనే ఎక్కువగా టాక్ నడుస్తోంది. దీనికి…
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (కూటమి) పట్టు పెంచుకుంటోందా? రాజకీయంగా వ్యూహాత్మక స్టెప్పులు వేస్తోందా? అంటే.. ఒననే అంటున్నారు…