‘బిగ్ బాస్’ నాలుగో సీజన్లో అభిజిత్ విజేతగా నిలుస్తాడన్నది ప్రేక్షకుల అంచనా. ఎందుకంటే సోషల్ మీడియాలో అతడి ఫాలోయింగ్ అలా ఉంది మరి. కొన్ని వారాలుగా ఎక్కడ ఏ పోల్ పెట్టినా అభిజితే టాప్లో ఉంటున్నాడు. మేనేజ్ చేస్తున్నారో, స్వతహాగా ఉన్న ఫాలోయింగో కానీ.. సోషల్ మీడియాలో అభిజిత్ పేరు మీద ట్రెండ్స్ చూస్తే అతనే హౌస్లో మోస్ట్ పాపులర్ అని ఎవ్వరికైనా అర్థమవుతుంది.
రెండో సీజన్లో కౌశల్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని, ఎక్కుమంది ఆమోదం పొందిన కంటెస్టెంట్గా అభిజిత్ను చెప్పుకోవచ్చు. కౌశల్ విషయంలో అదే స్థాయిలో నెగెటివిటీ కూడా కనిపించింది కానీ.. అభిజిత్ పట్ల జనాల్లో అలాంటి వ్యతిరేకతే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అతను బిగ్ బాస్-4 విన్నర్ కావడం ఖాయం అనే అభిప్రాయాల్లో జనం ఉన్నారు. కానీ క్లైమాక్స్లో పెద్ద ట్విస్ట్ ఇవ్వడానికి ‘బిగ్ బాస్’ టీం రెడీ అవుతున్నట్లుగా సంకేతాలు వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తొలి మూడు సీజన్లలోనే మేల్ కంటెస్టెంటే విజేతగా నిలిచిన నేపథ్యంలో.. ఈసారి కూడా పురుషుడే గెలిస్తే ‘బిగ్ బాస్’లో అమ్మాయిలు గెలవరు అనే అభిప్రాయం పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో విజేతను ‘మార్చడానికి’ సన్నాహాలు జరుగుతున్నట్లుగా ఓ ప్రచారం నడుస్తోంది. ఈ సీజన్లో అంచనాలకు భిన్నంగా అరియానా విజేతగా నిలిస్తే ఆశ్చర్యం లేదంటున్నారు. మొన్నటిదాకా అన్ని పోల్స్లో, ఓటింగ్స్లో అభిజిత్, సోహైల తర్వాత మూడో స్థానంలో ఉంటూ వచ్చిన అరియానా.. గత రెండు మూడు రోజులుగా పోల్స్, ఓటింగ్స్లో టాప్లో కనిపిస్తుండటం ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది.
‘బిగ్ బాస్’ విజేతన పూర్తిగా ప్రేక్షకుల ఓటింగ్ను బట్టే ఉంటుందని నిర్వాహకులు అంటుంటారు కానీ.. ఎలిమినేషన్లలో కొన్నిసార్లు ఫలితాలు చూస్తే ఈ షో అంతా స్క్రిప్టెడ్ ఏమో అనిపించక మానదు. లేదంటే జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మోనాల్ షో చివరి వారం ముందు వరకు హౌస్లో కొనసాగేది కాదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్-3 విజేతగా అరియానాను నిలబెట్టేందుకు నిర్వాహకులు స్క్రిప్టు రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజంగా అదే జరిగితే షో విశ్వసనీయత దెబ్బ తినడం ఖాయం. మరి ఏమవుతుందో చూడాలి.
This post was last modified on December 17, 2020 4:28 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…