‘బిగ్ బాస్’ నాలుగో సీజన్లో అభిజిత్ విజేతగా నిలుస్తాడన్నది ప్రేక్షకుల అంచనా. ఎందుకంటే సోషల్ మీడియాలో అతడి ఫాలోయింగ్ అలా ఉంది మరి. కొన్ని వారాలుగా ఎక్కడ ఏ పోల్ పెట్టినా అభిజితే టాప్లో ఉంటున్నాడు. మేనేజ్ చేస్తున్నారో, స్వతహాగా ఉన్న ఫాలోయింగో కానీ.. సోషల్ మీడియాలో అభిజిత్ పేరు మీద ట్రెండ్స్ చూస్తే అతనే హౌస్లో మోస్ట్ పాపులర్ అని ఎవ్వరికైనా అర్థమవుతుంది.
రెండో సీజన్లో కౌశల్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని, ఎక్కుమంది ఆమోదం పొందిన కంటెస్టెంట్గా అభిజిత్ను చెప్పుకోవచ్చు. కౌశల్ విషయంలో అదే స్థాయిలో నెగెటివిటీ కూడా కనిపించింది కానీ.. అభిజిత్ పట్ల జనాల్లో అలాంటి వ్యతిరేకతే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అతను బిగ్ బాస్-4 విన్నర్ కావడం ఖాయం అనే అభిప్రాయాల్లో జనం ఉన్నారు. కానీ క్లైమాక్స్లో పెద్ద ట్విస్ట్ ఇవ్వడానికి ‘బిగ్ బాస్’ టీం రెడీ అవుతున్నట్లుగా సంకేతాలు వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తొలి మూడు సీజన్లలోనే మేల్ కంటెస్టెంటే విజేతగా నిలిచిన నేపథ్యంలో.. ఈసారి కూడా పురుషుడే గెలిస్తే ‘బిగ్ బాస్’లో అమ్మాయిలు గెలవరు అనే అభిప్రాయం పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో విజేతను ‘మార్చడానికి’ సన్నాహాలు జరుగుతున్నట్లుగా ఓ ప్రచారం నడుస్తోంది. ఈ సీజన్లో అంచనాలకు భిన్నంగా అరియానా విజేతగా నిలిస్తే ఆశ్చర్యం లేదంటున్నారు. మొన్నటిదాకా అన్ని పోల్స్లో, ఓటింగ్స్లో అభిజిత్, సోహైల తర్వాత మూడో స్థానంలో ఉంటూ వచ్చిన అరియానా.. గత రెండు మూడు రోజులుగా పోల్స్, ఓటింగ్స్లో టాప్లో కనిపిస్తుండటం ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది.
‘బిగ్ బాస్’ విజేతన పూర్తిగా ప్రేక్షకుల ఓటింగ్ను బట్టే ఉంటుందని నిర్వాహకులు అంటుంటారు కానీ.. ఎలిమినేషన్లలో కొన్నిసార్లు ఫలితాలు చూస్తే ఈ షో అంతా స్క్రిప్టెడ్ ఏమో అనిపించక మానదు. లేదంటే జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మోనాల్ షో చివరి వారం ముందు వరకు హౌస్లో కొనసాగేది కాదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్-3 విజేతగా అరియానాను నిలబెట్టేందుకు నిర్వాహకులు స్క్రిప్టు రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజంగా అదే జరిగితే షో విశ్వసనీయత దెబ్బ తినడం ఖాయం. మరి ఏమవుతుందో చూడాలి.
This post was last modified on December 17, 2020 4:28 pm
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…