అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి 1. కానీ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. 12ఏ రైల్వేకాలనీ డిజాస్టర్ అయ్యాక అల్లరోడి మార్కెట్ దారుణంగా డ్యామేజయ్యింది.
అంతకు ముందు కూడా ఫ్లాపులు ఉన్నప్పటికీ మినిమమ్ ఓపెనింగ్స్ ఉన్న హీరో నుంచి ఇప్పుడు కొన్ని చోట్ల డే వన్ డెఫిషిట్లు నమోదు చేసే స్థాయికి పడిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రభావం నేరుగా ఆల్కహాల్ మీద పడినట్టు ఉంది. మెహర్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ కు జిబ్రాన్ సంగీతం అందించారు.
రుహానీ శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్కహాల్ తీసింది చిన్నా చితక సంస్థ కాదు. మంచి ఊపు మీదున్న సితార ఎంటర్ టైన్మెంట్స్. ఈ ఏడాది నెలకో హిట్ ఇస్తానని శపథం చేసిన నిర్మాత నాగవంశీ దానికి తగ్గట్టుగానే జనవరిలో అనగనగా ఒక రాజుతో బోణీ చేశారు.
ఫిబ్రవరిలో ఫంకీ ఈ సెంటిమెంట్ ని బలపరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అటుపై కూడా లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ మధ్యలో ఆల్కహాల్ ఊసు వినిపించడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇదేమి విఎఫెక్స్ డిమాండ్ భారీ సబ్జెక్టు కాదు. షూటింగ్ అయిపోయింది కూడా.
అలాంటప్పుడు ఎందుకు పెండింగ్ పెట్టారనేది సస్పెన్స్ గానే ఉంది. అయినా ఇప్పటికిప్పుడు ఈ సినిమాని రిలీజ్ కు రెడీ చేసినా అమాంతం హైప్ వచ్చే అవకాశాలు తక్కువ. విపరీతమైన ప్రమోషన్లు చేయాలి. కంటెంట్ ని జనాలకు దగ్గరగా తీసుకెళ్లాలి. అసలు టైటిలే ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం పెట్టేలా ఉంది.
ఇన్ని ప్రతీకూలతల మధ్య పబ్లిసిటీ చేయడం సవాలే. అందుకే టీమ్ ఆగినట్టు కనిపిస్తోంది. అయినా ఏదో ఒక వైవిధ్యం లేనిదే సితార కాంపౌండ్ లోకి ఆల్కహాల్ ఎంటర్ కాదు. సో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. వీలైనంత త్వరగా మోక్షం దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు వస్తుందో.
This post was last modified on February 4, 2026 4:47 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…