అల్లు అర్జున్, సుకుమార్ల కలయికలో మూడో సినిమా ఖరారై దాదాపు రెండేళ్లు అవుతోంది. కానీ ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది నెల కిందటే. ఈ ఆలస్యానికి ఎన్నెన్నో కారణాలున్నాయి. అన్ని అడ్డంకులనూ అధిగమించి గత నెల తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ మొదలుపెట్టారు. భారీ సెటప్, ఖర్చుతో లాంగ్ షెడ్యూలే ప్లాన్ చేసుకుంది చిత్ర బృందం. అనుకున్న ప్రకారమే చిత్రీకరణ సాగించారు కానీ.. మధ్యలో కరోనా వచ్చి చిత్ర బృందాన్ని షేక్ చేసేసింది.
సినిమా యూనిట్లో పదుల సంఖ్యలో కరోనా బాధితులు తేలడంతో అప్పటికప్పుడు చిత్రీకరణ ఆపేసి హైదరాబాద్కు వచ్చేయాల్సి వచ్చింది. దీంతో గ్యాప్ అనివార్యమైంది. ఐతే మళ్లీ ఇప్పుడే మారేడుమిల్లికి తిరిగెళ్లే పరిస్థితి లేక.. మధ్యలో హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లోని కాచిగూడలో మొదలైంది. అక్కడ ఓ పాత కళ్యాణమండపాన్ని అద్దెకు తీసుకుని చిత్రీకరణ సాగిస్తున్నారట. ఈ సినిమా 25-30 ఏళ్ల ముందు నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. అప్పటి వాతావరణానికి తగ్గట్లుగా సెటప్ చేసుకుని షూటింగ్ చేస్తున్నారు. కొన్ని రోజులు ఇక్కడ చిత్రీకరణ జరిపాక హైదరాబాద్ శివార్లలో మరికొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారట. ఈ షెడ్యూల్ అయిపోయాక కొంత గ్యాప్ తీసుకుని తర్వాత మారేడుమిల్లికి వెళ్లనున్నారట.
ఈసారి ఏమాత్రం తేడా రాకుండా ప్లాన్ చేసుకుని తక్కువమంది కాస్ట్ అండ్ క్రూతో అక్కడికి వెళ్తారట. విరామం లేకుండా షూటింగ్ జరిపితే సగం పైగా సినిమా పూర్తయిపోతుందని సమాచారం. ఇప్పటికే చాలా సమయం వృథా అయిన నేపథ్యంలో సుక్కు తన గత సినిమాలతో పోలిస్తే చాలా వేగంగా, తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేయాలనే ప్రణాళికలతో ఉన్నారట.
This post was last modified on December 17, 2020 12:25 pm
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…
ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…