ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి నెంబర్ల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పేసుకుని ఎక్కువ సంపాదించాలనే యావ చూపించలేదు. విరాట పర్వం ఫ్లాప్ అయినా, తండేల్ హిట్ అయినా తన ధోరణిలో ఎలాంటి మార్పు ఉండదు.
భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలిగా నటించే అవకాశం వచ్చినా కేవలం రీమేకనే కారణంతో వద్దని చెప్పడం తన స్థిరమైన ఆలోచనలకు నిదర్శనం. అందుకే నాలుగు వేలకోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణలో సీతగా ఛాన్స్ కొట్టేసింది. ఈ కంటెంట్ కనక కరెక్ట్ గా క్లిక్ అయితే ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు రావడమే కాదు కొన్ని జనరేషన్లకు సీతగా గుర్తుండిపోతుంది.
ఇదిలా ఉండగా త్వరలో ప్రారంభం కానున్న కల్కి 2లో సాయిపల్లవిని ఫైనల్ చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ లీక్ గత వారమే వచ్చినప్పటికీ తాజాగా ఓకే అయ్యిందని వినికిడి. అయితే అధికారిక ప్రకటన వెంటనే ఇవ్వకపోవచ్చు కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ వేసవి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య టీజర్ కూడా వదిలారు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ లవ్ ఎమోషనల్ డ్రామా మే 1 ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇది తనకు టెస్టింగ్ లాంచ్ అని చెప్పొచ్చు.
ఇవి కాకుండా ధనుష్ 55వ సినిమాలోనూ సాయిపల్లవి ఉంది. ఈ సినిమాలన్నీ కూడా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసేవే. ఏదీ రెగ్యులర్ ఫ్లేవర్ లో ఉండదు. ఈ ఏడాదితో కలిపి మొత్తం మూడు సంవత్సరాల్లో ఎవరూ అందుకోలేని మైలురాళ్ళు తనకు దక్కే ఛాన్స్ పుష్కలంగా ఉంది.
రామాయణ మొదటి భాగం ఇప్పటికే పూర్తయిపోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీపావళి రిలీజ్ ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు కాబట్టి దానికి అనుగుణంగా స్పీడ్ పెంచారు. రెండో భాగం బ్యాలన్స్ కూడా ఈ సంవత్సరమే అయిపోతుందని అంటున్నారు. కల్కి ఫిక్స్ అయితే మొత్తం అయిదు సినిమాల్లో సాయిపల్లవి కనిపించనుంది.
This post was last modified on February 3, 2026 11:00 am
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్లు విధించిన సంగతి…
భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. గత ఏడాది పహల్గాం దాడితో అవి మరింత క్షీణించాయి.…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కర్ణాటక అవతల సినీ ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడిగా, నటుడిగా అప్పటికే కొన్ని…
పదేళ్ల ముందు రిలీజైన సినిమా.. దంగల్. కానీ ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ రికార్డు ఆ సినిమా పేరు…
వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు,…
తెలుగు టీవీ చరిత్రలోనే ట్రెండ్ సెట్టింగ్ షోల్లో ఆట ఒకటి. అప్పటికే వేరే ఛానెళ్లలో కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్నప్పటికీ.…