కాదేదీ ఫ్యాన్ వార్స్కు అనర్హం అన్నట్లుగా.. సోషల్ మీడియాలో గొడవలు పడడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఉంటారు సినీ అభిమానులు. ఈ ఫ్యాన్ వార్స్లో భాగంగా అసలు సంబంధం లేని వాళ్లను కూడా ఇన్వాల్వ్ చేసి ట్రోల్ చేయడమూ జరుగుతుంటుంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ, అట్లీ.. ఇలాగే ట్రోల్ అవుతున్నారు.
టాలీవుడ్ అభిమాన గణాల్లో రకరకాల వర్గాలున్న సంగతి తెలిసిందే. ఆ వర్గాల్లో ఎవరు ఎప్పుడు ఎవరితో గొడవ పడతారో అంచనా వేయలేం. కొన్నిసార్లు రెండు వర్గాలు కలిసి ఇంకో వర్గం మీదికి వెళ్తుంటాయి. ఆ సందర్భంలో కలిసి ఉన్న వాళ్లు తర్వాత ఇంకో మూమెంట్లో విరోధులుగా మారి గొడవ పడుతుంటారు. ఇప్పుడు ఎవరిని ఎవరు ఎందుకు ట్రిగ్గర్ చేశారో కానీ.. ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎక్స్లో పెద్ద గొడవ నడుస్తోంది.
ఈ క్రమంలో ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న సందీప్ రెడ్డి వంగను అల్లు అర్జున్ అభిమానులు టార్గెట్ చేస్తుంటే.. రెబల్ ఫ్యాన్సేమో బన్నీతో సినిమా తీస్తున్న అట్లీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దర్శకులు ఇద్దరి మీద అవతలి వాళ్లు కాపీ ముద్ర వేసి ట్రోల్ చేస్తున్నారు.
అట్లీకి ముందు నుంచి ‘కాపీ డైరెక్టర్’ అనే ముద్ర ఉంది. పాత కథలనే అటు ఇటు తిప్పి సినిమాలు తీస్తాడని.. హాలీవుడ్ సినిమాల్లో సీన్లు లేపేస్తాడని విమర్శలున్నాయి. ఇదే పాయింట్ మీద తన పాత సినిమాల్లోని కాపీ సీన్లను పోస్ట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే.. బన్నీ అభిమానులు రంగంలోకి దిగారు.
యానిమల్, అర్జున్ రెడ్డి చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలకు స్ఫూర్తిగా నిలిచిన హాలీవుడ్ చిత్రాల సీన్ల తాలూకు వీడియోలు తెచ్చి పోస్ట్ చేస్తూ సందీప్ కూడా కాపీ డైరెక్టరే అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అభిమానుల గొడవలేమో కానీ.. వారి దెబ్బకు దర్శకుల ఇమేజ్ దెబ్బ తింటోంది.
This post was last modified on February 2, 2026 5:56 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…