కాదేదీ ఫ్యాన్ వార్స్కు అనర్హం అన్నట్లుగా.. సోషల్ మీడియాలో గొడవలు పడడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఉంటారు సినీ అభిమానులు. ఈ ఫ్యాన్ వార్స్లో భాగంగా అసలు సంబంధం లేని వాళ్లను కూడా ఇన్వాల్వ్ చేసి ట్రోల్ చేయడమూ జరుగుతుంటుంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ, అట్లీ.. ఇలాగే ట్రోల్ అవుతున్నారు.
టాలీవుడ్ అభిమాన గణాల్లో రకరకాల వర్గాలున్న సంగతి తెలిసిందే. ఆ వర్గాల్లో ఎవరు ఎప్పుడు ఎవరితో గొడవ పడతారో అంచనా వేయలేం. కొన్నిసార్లు రెండు వర్గాలు కలిసి ఇంకో వర్గం మీదికి వెళ్తుంటాయి. ఆ సందర్భంలో కలిసి ఉన్న వాళ్లు తర్వాత ఇంకో మూమెంట్లో విరోధులుగా మారి గొడవ పడుతుంటారు. ఇప్పుడు ఎవరిని ఎవరు ఎందుకు ట్రిగ్గర్ చేశారో కానీ.. ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎక్స్లో పెద్ద గొడవ నడుస్తోంది.
ఈ క్రమంలో ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న సందీప్ రెడ్డి వంగను అల్లు అర్జున్ అభిమానులు టార్గెట్ చేస్తుంటే.. రెబల్ ఫ్యాన్సేమో బన్నీతో సినిమా తీస్తున్న అట్లీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దర్శకులు ఇద్దరి మీద అవతలి వాళ్లు కాపీ ముద్ర వేసి ట్రోల్ చేస్తున్నారు.
అట్లీకి ముందు నుంచి ‘కాపీ డైరెక్టర్’ అనే ముద్ర ఉంది. పాత కథలనే అటు ఇటు తిప్పి సినిమాలు తీస్తాడని.. హాలీవుడ్ సినిమాల్లో సీన్లు లేపేస్తాడని విమర్శలున్నాయి. ఇదే పాయింట్ మీద తన పాత సినిమాల్లోని కాపీ సీన్లను పోస్ట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే.. బన్నీ అభిమానులు రంగంలోకి దిగారు.
యానిమల్, అర్జున్ రెడ్డి చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలకు స్ఫూర్తిగా నిలిచిన హాలీవుడ్ చిత్రాల సీన్ల తాలూకు వీడియోలు తెచ్చి పోస్ట్ చేస్తూ సందీప్ కూడా కాపీ డైరెక్టరే అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అభిమానుల గొడవలేమో కానీ.. వారి దెబ్బకు దర్శకుల ఇమేజ్ దెబ్బ తింటోంది.
This post was last modified on February 2, 2026 5:56 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…