Movie News

మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్

​టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే గ్లోబల్ రేంజ్ క్రేజ్ వస్తుంది కానీ, ఆ తర్వాత వచ్చే దర్శకుడు ఆ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండాలనే విషయంలో చాలా పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

​రాజమౌళి సృష్టించే ఆ భారీ ఎత్తును అందుకోవాలంటే నేటి తరం దర్శకుల్లో సందీప్ వంగానే బెస్ట్ ఆప్షన్ అనే చర్చ నడుస్తోంది. రాజమౌళి స్వయంగా వంగా మేకింగ్ స్టైల్‌ను ఇష్టపడతారని చాలా సందర్భాల్లో చెప్పారు. కమర్షియల్ హంగులతో పాటు ఇంటెన్సిటీని చూపించడంలో వంగాకి ఒక సెపరేట్ రూట్ ఉంది. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ఆ ‘హై’ ని కొనసాగించాలంటే వంగా లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడితో సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ రికార్డులు తిరగరాయచ్చనేది ఫ్యాన్స్ మాట.

​అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ క్రేజీ కాంబో ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. సందీప్ వంగా తన పాత కమిట్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తర్వాత రణబీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2027లో ప్రారంభం కాబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా లైన్ లో ఉంది. కాబట్టి మహేష్ బాబు వంగా కాంబినేషన్ కు ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదు.

​మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ పూర్తి చేసుకుని 2027 లో ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. సరిగ్గా అదే టైమ్‌కి వంగా కూడా తన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వీరిద్దరూ జతకట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ రాజమౌళి తర్వాత మహేష్ మరో ఆప్షన్ వెతుక్కోవాల్సి వస్తే, ఆ రేంజ్ ని తట్టుకునే దర్శకుడు ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజమౌళి సినిమాతో వచ్చే పాన్ ఇండియా క్రేజ్‌ను కాపాడుకోవాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలి.

Kumar

Recent Posts

రామాయణ ఇంకెప్పుడు మేలుకుంటుంది

ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…

3 hours ago

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి…

7 hours ago

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

9 hours ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

10 hours ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

11 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

12 hours ago