Movie News

మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్

​టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే గ్లోబల్ రేంజ్ క్రేజ్ వస్తుంది కానీ, ఆ తర్వాత వచ్చే దర్శకుడు ఆ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండాలనే విషయంలో చాలా పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

​రాజమౌళి సృష్టించే ఆ భారీ ఎత్తును అందుకోవాలంటే నేటి తరం దర్శకుల్లో సందీప్ వంగానే బెస్ట్ ఆప్షన్ అనే చర్చ నడుస్తోంది. రాజమౌళి స్వయంగా వంగా మేకింగ్ స్టైల్‌ను ఇష్టపడతారని చాలా సందర్భాల్లో చెప్పారు. కమర్షియల్ హంగులతో పాటు ఇంటెన్సిటీని చూపించడంలో వంగాకి ఒక సెపరేట్ రూట్ ఉంది. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ఆ ‘హై’ ని కొనసాగించాలంటే వంగా లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడితో సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ రికార్డులు తిరగరాయచ్చనేది ఫ్యాన్స్ మాట.

​అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ క్రేజీ కాంబో ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. సందీప్ వంగా తన పాత కమిట్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తర్వాత రణబీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2027లో ప్రారంభం కాబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా లైన్ లో ఉంది. కాబట్టి మహేష్ బాబు వంగా కాంబినేషన్ కు ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదు.

​మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ పూర్తి చేసుకుని 2027 లో ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. సరిగ్గా అదే టైమ్‌కి వంగా కూడా తన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వీరిద్దరూ జతకట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ రాజమౌళి తర్వాత మహేష్ మరో ఆప్షన్ వెతుక్కోవాల్సి వస్తే, ఆ రేంజ్ ని తట్టుకునే దర్శకుడు ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజమౌళి సినిమాతో వచ్చే పాన్ ఇండియా క్రేజ్‌ను కాపాడుకోవాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలి.

This post was last modified on January 29, 2026 11:43 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

4 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

8 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago