ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన శృంగార తార షకీలా జీవిత కథ ఆధారంగా ‘షకీలా’ పేరుతో ఓ బహు భాషా చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ బాగానే చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ట్రైలర్ కూడా వదిలారు. షకీలా జీవితంలో వాస్తవంగా ఏం జరిగిందో ఏమో కానీ.. ఈ సినిమాలో మాత్రం డ్రామాకు లోటు లేనట్లే కనిపిస్తోంది.
80ల్లో దక్షిణాది సినిమాల్లో శృంగార రసాన్ని ఒక రేంజిలో పండించిన సిల్క్ స్మిత హఠాన్మరణంతో ఏర్పడిన ఖాళీని పూరించడానికి.. షకీలా వచ్చినట్లుగా ఇందులో చూపించారు. చిన్న వయసులోనే తండ్రి మరణం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో షకీలా సినిమాల్లోకి వచ్చి ముందుగా రొమాంటిక్ సినిమాల్లో నటించినట్లు.. ఆ తర్వాత సాఫ్ట్ పోర్న్ సినిమాల్లోకి అడుగు పెట్టినట్లు ప్రొజెక్ట్ చేశారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. షకీలా నటించిన సాఫ్ట్ పోర్న్ సినిమాల గురించి ట్రైలర్లో చూపించిన దృశ్యాలు మాత్రం ఆశ్చర్యం కలిగించేవే. ముఖం మాత్రమే నీది, బాడీ వేరే వాళ్లది అంటూ.. సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో షకీలా అసలు శృంగార సన్నివేశాలే చేయలేదు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగినట్లుగా ఉంది. అలాగే పంకజ్ త్రిపాఠి పోషించిన పాత్రను మమ్ముట్టికి అనుకరణగా భావించారు కానీ.. ట్రైలర్లో చూపించిన దృశ్యాలు చూస్తే అది పూర్తిగా కల్పితం అనిపిస్తోంది.
ఇంకా ట్రైలర్లో చూపించిన అనేక సన్నివేశాలు, షాట్లు గమనిస్తే షకీలా జీవితంలోని విషయాలను.. ఆమె స్థాయిని బాగా ఎగ్జాజరేట్ చేసి చూపించే ప్రయత్నం జరిగినట్లే ఉంది. బాలీవుడ్ నిర్మాతలు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని ఇంద్రజిత్ లంకేష్ రూపొందించాడు. షకీలా పాత్రను రిచా చద్దా పోషించిన ఈ సినిమా క్రిస్మస్ సీజన్లో థియేటర్లలో ఏమేర సందడి చేస్తుందో చూడాలి.
This post was last modified on December 16, 2020 1:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…