జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దేవర విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ ఇప్పటిదాకా సీక్వెల్ ఊసు లేక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతూ వచ్చారు. ఉంటుందని ఒకసారి, లేదని మరోసారి ఇలా రకరకాల ప్రచారాలు చర్చలోకి వచ్చాయి.
దర్శకుడు కొరటాల శివ బయట మీడియాకు కనిపించనంతగా అందుబాటులో లేకపోవడం అనుమానాలను మరింత బలపడేలా చేసింది. ఆ మధ్య తారక్ బర్త్ డే రోజు దేవర 2 ఉంటుందనే తరహాలో చిన్న పోస్టర్ వదిలారు తప్పించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మిక్కిలినేని పార్ట్ 2 గురించి స్పందించడం వైరల్ అవుతోంది.
జనగాంలో జరుగుతున్న ఒక ఫెస్టివల్ ఈవెంట్ లో పాల్గొన్న సుధాకర్ స్టేజి మీద యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మే నుంచి దేవర 2 మొదలవుతుందని, వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని వేదిక సాక్షిగా హామీ ఇచ్చారు. మీ అంచనాలను మించిపోయేలా బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా చెప్పేశారు.
అంటే ప్రశాంత్ నీల్ మూవీ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదేనని క్లారిటీ వచ్చేసినట్టే. నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ ఎంతలేదన్నా ఏడాదికి పైగా సమయం పడుతుంది కాబట్టి 2027 దసరా లేదా దీపావళికి దేవర 2ని చూడొచ్చు. అయితే ఆ టైంకంతా మళ్ళీ హైప్ సృష్టించడం కొరటాల టీమ్ ముందున్న అతి పెద్ద బాధ్యత.
ఇన్స్ సైడ్ టాక్ ప్రకారం దేవర 2కి సంబంధించిన కొంత భాగం గతంలోనే షూట్ చేశారు. తర్వాత తారక్ వార్ 2 కోసం బిజీ కావడంతో దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అందులోనూ ప్రశాంత్ నీల్ ని వదులుకుంటే మళ్ళీ దొరికే పరిస్థితి లేకపోవడంతో వెంటనే దానికి షిఫ్ట్ అయిపోయారు.
విశ్వసనీయ సమాచారం మేరకు దేవర 2 స్క్రిప్ట్ దాదాపుగా లాకైపోయింది. ఫస్ట్ పార్ట్ మీద వచ్చిన కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న టీమ్ ఇప్పుడీ సీక్వెల్ లో ఎలాంటి కంప్లయింట్స్ కి ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట. పెద్ద దేవర ఎలా చనిపోయాడు, వర ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు లాంటి ప్రశ్నలకు సమాధానం దేవర 2లో చూడాలి.
This post was last modified on January 27, 2026 11:26 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…