బిగ్ బాష్ షో తెలుగులో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ షోకు ఏటా భారీగా వ్యూయర్షిప్ వస్తుంది. ఆ షో జరిగినన్ని రోజులు సోషల్ మీడియాలో కూడా దాని గురించి బాగా హడావుడి ఉంటుంది. ఆ షోలో పాల్గొన్న వాళ్లకు మంచి పాపులారిటీ వస్తుంది. కానీ ఆ పాపులారిటీ వాళ్లు చేసే సినిమాలకు ఉపయోగపడుతుందా అంటే మాత్రం ఔనని చెప్పలేం.
కౌశల్ మండ సహా బిగ్ బాస్ విన్నర్లు, వేరే టాప్ కంటెస్టెంట్లు ఎవ్వరూ కూడా సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయారు. బిగ్ బాస్ పాపులారిటీ చూసుకుని వరుసగా సినిమాలు ఒప్పకున్న సోహెల్ సైతం ఎలా దెబ్బ తిన్నాడో తెలిసిందే. తాను హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు సినిమాను థియేటర్లకు వచ్చి జనాలు చూడట్లేదని సోహెల్ కన్నీళ్లు కూడా పెట్టుకోవడం గుర్తుండే ఉంటుంది. బిగ్ బాస్లో తనకు ఓట్లు వేసిన వాళ్లంతా ఏమైపోయారంటూ అతను ఆవేదన చెందాడు. కానీ దాని వల్ల ఫలితం లేకపోయింది.
ఐతే ఇప్పుడు బిగ్ బాస్ పాపులారిటీ ద్వారా సుమతీ శతకం అనే సినిమాలో అవకాశం దక్కించుకున్న అమర్ దీప్ మాత్రం.. సోహెల్ లాగా కాకుండా రియాలిటీకి దగ్గరగా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్లో పడే ఓట్లకు, సినిమాలు చూడడానికి సంబంధం లేదని అతను తేల్చేశాడు. అదీ, ఇదీ వేరని అతను కుండబద్దలు కొట్టాడు.
”బిగ్ బాస్లో ఓట్లు వేశారు కదా అని వాళ్లంతా థియేటర్లకు వస్తారని ఆశించి మనం సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో నిరూపించుకుని వాళ్లను రప్పించుకోవాలి. అంతే తప్ప ఆ ఓట్లు దీనికి పనికి రావు. బిగ్ బాస్లో విన్నర్ అయినా.. టాప్-5లో ఉన్నా అదంతా ఏక్ దిన్ కా రాజా అన్నట్లే. ఆ ఒక్క రోజుకే అది పరిమితం. ఆ తర్వాత అంతా నార్మలే.
ఈవెంట్లు చేసుకుంటూ, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కు వెళ్తూ, స్టేజ్ షోలు చేసుకోవడమే. అక్కడ వచ్చిన పేరును ఎలా ఉపయోగంచుకోవాలన్నది మాత్రం తెలుసుకోవాలి. ఈ క్రమంలో కొంచెం ఆలస్యమైనా సక్సెస్ మాత్రం వస్తుంది. బిగ్ బాస్లో చేసిన వాళ్లందరినీ హీరోలను చేయాలంటే ఈ పాటికి ఆ లిస్ట్ చాలా పెద్దది అయ్యేది. ఆ షోలో మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి మనకు ఓట్లు వేస్తారంతే” అని తేల్చేశాడు అమర్ దీప్.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…