బిగ్ బాష్ షో తెలుగులో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ షోకు ఏటా భారీగా వ్యూయర్షిప్ వస్తుంది. ఆ షో జరిగినన్ని రోజులు సోషల్ మీడియాలో కూడా దాని గురించి బాగా హడావుడి ఉంటుంది. ఆ షోలో పాల్గొన్న వాళ్లకు మంచి పాపులారిటీ వస్తుంది. కానీ ఆ పాపులారిటీ వాళ్లు చేసే సినిమాలకు ఉపయోగపడుతుందా అంటే మాత్రం ఔనని చెప్పలేం.
కౌశల్ మండ సహా బిగ్ బాస్ విన్నర్లు, వేరే టాప్ కంటెస్టెంట్లు ఎవ్వరూ కూడా సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయారు. బిగ్ బాస్ పాపులారిటీ చూసుకుని వరుసగా సినిమాలు ఒప్పకున్న సోహెల్ సైతం ఎలా దెబ్బ తిన్నాడో తెలిసిందే. తాను హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు సినిమాను థియేటర్లకు వచ్చి జనాలు చూడట్లేదని సోహెల్ కన్నీళ్లు కూడా పెట్టుకోవడం గుర్తుండే ఉంటుంది. బిగ్ బాస్లో తనకు ఓట్లు వేసిన వాళ్లంతా ఏమైపోయారంటూ అతను ఆవేదన చెందాడు. కానీ దాని వల్ల ఫలితం లేకపోయింది.
ఐతే ఇప్పుడు బిగ్ బాస్ పాపులారిటీ ద్వారా సుమతీ శతకం అనే సినిమాలో అవకాశం దక్కించుకున్న అమర్ దీప్ మాత్రం.. సోహెల్ లాగా కాకుండా రియాలిటీకి దగ్గరగా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్లో పడే ఓట్లకు, సినిమాలు చూడడానికి సంబంధం లేదని అతను తేల్చేశాడు. అదీ, ఇదీ వేరని అతను కుండబద్దలు కొట్టాడు.
”బిగ్ బాస్లో ఓట్లు వేశారు కదా అని వాళ్లంతా థియేటర్లకు వస్తారని ఆశించి మనం సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో నిరూపించుకుని వాళ్లను రప్పించుకోవాలి. అంతే తప్ప ఆ ఓట్లు దీనికి పనికి రావు. బిగ్ బాస్లో విన్నర్ అయినా.. టాప్-5లో ఉన్నా అదంతా ఏక్ దిన్ కా రాజా అన్నట్లే. ఆ ఒక్క రోజుకే అది పరిమితం. ఆ తర్వాత అంతా నార్మలే.
ఈవెంట్లు చేసుకుంటూ, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కు వెళ్తూ, స్టేజ్ షోలు చేసుకోవడమే. అక్కడ వచ్చిన పేరును ఎలా ఉపయోగంచుకోవాలన్నది మాత్రం తెలుసుకోవాలి. ఈ క్రమంలో కొంచెం ఆలస్యమైనా సక్సెస్ మాత్రం వస్తుంది. బిగ్ బాస్లో చేసిన వాళ్లందరినీ హీరోలను చేయాలంటే ఈ పాటికి ఆ లిస్ట్ చాలా పెద్దది అయ్యేది. ఆ షోలో మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి మనకు ఓట్లు వేస్తారంతే” అని తేల్చేశాడు అమర్ దీప్.
This post was last modified on January 25, 2026 8:15 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…