బిగ్ బాష్ షో తెలుగులో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ షోకు ఏటా భారీగా వ్యూయర్షిప్ వస్తుంది. ఆ షో జరిగినన్ని రోజులు సోషల్ మీడియాలో కూడా దాని గురించి బాగా హడావుడి ఉంటుంది. ఆ షోలో పాల్గొన్న వాళ్లకు మంచి పాపులారిటీ వస్తుంది. కానీ ఆ పాపులారిటీ వాళ్లు చేసే సినిమాలకు ఉపయోగపడుతుందా అంటే మాత్రం ఔనని చెప్పలేం.
కౌశల్ మండ సహా బిగ్ బాస్ విన్నర్లు, వేరే టాప్ కంటెస్టెంట్లు ఎవ్వరూ కూడా సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయారు. బిగ్ బాస్ పాపులారిటీ చూసుకుని వరుసగా సినిమాలు ఒప్పకున్న సోహెల్ సైతం ఎలా దెబ్బ తిన్నాడో తెలిసిందే. తాను హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు సినిమాను థియేటర్లకు వచ్చి జనాలు చూడట్లేదని సోహెల్ కన్నీళ్లు కూడా పెట్టుకోవడం గుర్తుండే ఉంటుంది. బిగ్ బాస్లో తనకు ఓట్లు వేసిన వాళ్లంతా ఏమైపోయారంటూ అతను ఆవేదన చెందాడు. కానీ దాని వల్ల ఫలితం లేకపోయింది.
ఐతే ఇప్పుడు బిగ్ బాస్ పాపులారిటీ ద్వారా సుమతీ శతకం అనే సినిమాలో అవకాశం దక్కించుకున్న అమర్ దీప్ మాత్రం.. సోహెల్ లాగా కాకుండా రియాలిటీకి దగ్గరగా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్లో పడే ఓట్లకు, సినిమాలు చూడడానికి సంబంధం లేదని అతను తేల్చేశాడు. అదీ, ఇదీ వేరని అతను కుండబద్దలు కొట్టాడు.
”బిగ్ బాస్లో ఓట్లు వేశారు కదా అని వాళ్లంతా థియేటర్లకు వస్తారని ఆశించి మనం సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో నిరూపించుకుని వాళ్లను రప్పించుకోవాలి. అంతే తప్ప ఆ ఓట్లు దీనికి పనికి రావు. బిగ్ బాస్లో విన్నర్ అయినా.. టాప్-5లో ఉన్నా అదంతా ఏక్ దిన్ కా రాజా అన్నట్లే. ఆ ఒక్క రోజుకే అది పరిమితం. ఆ తర్వాత అంతా నార్మలే.
ఈవెంట్లు చేసుకుంటూ, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కు వెళ్తూ, స్టేజ్ షోలు చేసుకోవడమే. అక్కడ వచ్చిన పేరును ఎలా ఉపయోగంచుకోవాలన్నది మాత్రం తెలుసుకోవాలి. ఈ క్రమంలో కొంచెం ఆలస్యమైనా సక్సెస్ మాత్రం వస్తుంది. బిగ్ బాస్లో చేసిన వాళ్లందరినీ హీరోలను చేయాలంటే ఈ పాటికి ఆ లిస్ట్ చాలా పెద్దది అయ్యేది. ఆ షోలో మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి మనకు ఓట్లు వేస్తారంతే” అని తేల్చేశాడు అమర్ దీప్.
This post was last modified on January 25, 2026 8:15 am
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…