టాలీవుడ్ జనాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఉప్పెన’ ఒకటి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుకుమార్ ఆమోద ముద్ర వేసిన కథ, ఆయన పర్యవేక్షణలో తయారైన సినిమా ఇది. విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడు కథ, పాత్ర నచ్చి ఈ చిత్రంలో నటించాడు. ఇలా చాలా ప్రత్యేకతలే ఉన్నాయీ సినిమాలో.
ఈ కథ సినిమాగా మారడానికి ముందు చాలానే స్క్రుటినీ జరిగింది. మరి ఇంతమంది మెచ్చిన కథలో అంత ప్రత్యేకత ఏముంది అన్నది ఆసక్తికరం. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉందట. ఆ ట్విస్టును ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందట.
ఓ పేదింటి కుర్రాడు.. ఒక పెద్దింటి అమ్మాయి.. వీళ్ల మధ్య సాగే ప్రేమకథే ‘ఉప్పెన’. దర్శకుడు బుచ్చిబాబు సనా తన నిజ జీవిత అనుభవాల నేపథ్యంలోనే ఈ సినిమాను రూపొందించాడట. హీరోయిన్ తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. తన కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో హీరోకు అతను చేసే నష్టమే ఈ సినిమాలో అతి పెద్ద ట్విస్ట్ అని సమాచారం. అది కొంచెం జీర్ణించుకోలేని విధంగా, ఇప్పటిదాకా తెలుగులో మరే సినిమాలోనూ చూడని ఉంటుందట.
ఒకప్పుడు అయితే ఇలాంటి అంశాలు తెలుగు సినిమాల్లో పెట్టడానికి సాహసించేవాళ్లు కానీ.. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారి, ప్రయోగాలను, హార్డ్ హిట్టింగ్ అంశాలను బాగానే స్వీకరిస్తున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ ప్రముఖులకు ఈ సినిమా చూపించి మెజారిటీ జనాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఫైనల్ కాపీని ఓకే చేసినట్లు సమాచారం. ఓవరాల్గా సినిమా బాగానే వచ్చిందని.. మెగా కుర్రాడికిది మంచి డెబ్యూ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…