టాలీవుడ్ జనాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఉప్పెన’ ఒకటి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుకుమార్ ఆమోద ముద్ర వేసిన కథ, ఆయన పర్యవేక్షణలో తయారైన సినిమా ఇది. విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడు కథ, పాత్ర నచ్చి ఈ చిత్రంలో నటించాడు. ఇలా చాలా ప్రత్యేకతలే ఉన్నాయీ సినిమాలో.
ఈ కథ సినిమాగా మారడానికి ముందు చాలానే స్క్రుటినీ జరిగింది. మరి ఇంతమంది మెచ్చిన కథలో అంత ప్రత్యేకత ఏముంది అన్నది ఆసక్తికరం. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉందట. ఆ ట్విస్టును ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందట.
ఓ పేదింటి కుర్రాడు.. ఒక పెద్దింటి అమ్మాయి.. వీళ్ల మధ్య సాగే ప్రేమకథే ‘ఉప్పెన’. దర్శకుడు బుచ్చిబాబు సనా తన నిజ జీవిత అనుభవాల నేపథ్యంలోనే ఈ సినిమాను రూపొందించాడట. హీరోయిన్ తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. తన కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో హీరోకు అతను చేసే నష్టమే ఈ సినిమాలో అతి పెద్ద ట్విస్ట్ అని సమాచారం. అది కొంచెం జీర్ణించుకోలేని విధంగా, ఇప్పటిదాకా తెలుగులో మరే సినిమాలోనూ చూడని ఉంటుందట.
ఒకప్పుడు అయితే ఇలాంటి అంశాలు తెలుగు సినిమాల్లో పెట్టడానికి సాహసించేవాళ్లు కానీ.. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారి, ప్రయోగాలను, హార్డ్ హిట్టింగ్ అంశాలను బాగానే స్వీకరిస్తున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ ప్రముఖులకు ఈ సినిమా చూపించి మెజారిటీ జనాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఫైనల్ కాపీని ఓకే చేసినట్లు సమాచారం. ఓవరాల్గా సినిమా బాగానే వచ్చిందని.. మెగా కుర్రాడికిది మంచి డెబ్యూ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.
This post was last modified on December 15, 2020 3:24 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…