స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్. కొన్నేళ్ల నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో, తమిళంలో టాప్ స్టార్ల సినిమాలను రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన స్పందన వస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఈ మధ్య ఎంతో శ్రద్ధ తీసుకుని ‘పడయప్పా’ (తెలుగులో నరసింహా) చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అది సంచలన వసూళ్లు సాధించింది.
ఇప్పుడు రజినీ మరో పాత సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలా అని అది రీ రిలీజ్ అనుకుంటే పొరపాటే. 37 ఏళ్ల ముందు రిలీజ్ కావాల్సిన సినిమాను కాస్తా.. ఇప్పుడే విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా పేరు.. హమ్ మే షెహెన్ షా కౌన్. ఈ హిందీ చిత్రాన్ని షూటింగ్ మొదలుపెట్టిన 37 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ చేయబోతుండడం విశేషం.
రజినీతో పాటు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, లెజెండరీ నటుడు శత్రుఘ్న సిన్హా ముఖ్య పాత్రలు పోషించిన ‘హమ్ మే షెహెన్ షా కౌన్’ను 1988లో రిలీజ్ చేయాలనుకున్నారు. హర్మేష్ మల్హోత్రా రూపొందించిన ఈ చిత్రం రకరకాల కారణాలతో అప్పుడు విడుదలకు నోచుకోలేదు. ల్యాబ్లోనే ఉండిపోయిన ఈ సినిమా ప్రింట్లను ఇప్పుడు రీ మాస్టర్ చేస్తున్నారు.
ఈ సినిమా మీద తాము ఎప్పుడూ ఆశ కోల్పోలేదని.. ‘హమ్ మే షెహెన్ షా కౌన్’ ఎన్నో ఎదురు దెబ్బలను, నిశ్శబ్దంతో కూడిని బాధను భరించిందని.. ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులను ఈ సినిమా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత రాజా రాయ్ తెలిపాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మరి ఇన్నేళ్ల తర్వాత విడుదలకు నోచుకుంటున్న తన చిత్రాన్ని రజినీకాంత్ ప్రమోట్ చేస్తాడేమో చూడాలి. ఈ చిత్రంలో దివంగత అమ్రిష్ పురి కూడా ఒక కీలక పాత్ర చేయడం విశేషం.
This post was last modified on January 24, 2026 11:05 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…