వరస డిజాస్టర్లతో నితిన్ బాగా డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు దారుణంగా బోల్తా కొట్టడం ఒక ఎత్తయితే, పెద్ద బడ్జెట్ తో ఎల్లమ్మని ప్లాన్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు ఇప్పుడా ప్రాజెక్టుకి దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా చేయడం మరో ట్విస్టు. తెరవెనుక కారణాలు ఏమైనా ఒక మంచి మూవీ చేజారిన ఫీలింగ్ అభిమానుల్లో ఉంది.
తమ్ముడు కన్నా ముందు హ్యాట్రిక్ ఫ్లాపుల వల్ల బాగా రిస్క్ లో పడ్డ నితిన్ ఆ మధ్య విక్రమ్ కె కుమార్ తో స్వారీ టైటిల్ తో సినిమా చేస్తాడని తెగ ప్రచారం జరిగింది. యువి క్రియేషన్స్ నిర్మాణమంటూ ఊదరగొట్టారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇక్కడితో అయిపోలేదు.
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో సితార సంస్థ తీస్తున్న కల్ట్ కూడా ముందు నితిన్ చేతికి వచ్చిందే. ఎందుకో తెలియదు కానీ దర్శకుడు ఆదిత్య హాసన్ తన ఛాయస్ మార్చుకున్నాడు. సరే అయిందేదో అయ్యింది ఒక్క పెద్ద హిట్టు పడితే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేయొచ్చనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్ళ నిరీక్షణ ఫలించేలా ఉంది.
2024 ఆయ్ రూపంలో సర్ప్రైజ్ సూపర్ హిట్ సాధించిన దర్శకుడు అంజి కె మణిపుత్రకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. అధికారికంగా ప్రకటించలేదు కానీ నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లోనే దీన్ని రూపొందించేందుకు ప్లాన్ సిద్ధమైయ్యిందట.
అంతా ఒకే అనుకోగానే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. ఇది కాకుండా తెలుసు కదా ఫేమ్ నీరజ కోనతో ఒక మూవీ లాక్ చేసుకునే ప్లాన్ లో ఉన్న నితిన్ దాన్ని లేట్ చేస్తాడా లేక వరస క్రమం మారుస్తాడానేది తెలియాల్సి ఉంది. ఒకప్పుడు ప్రామిసింగ్ మార్కెట్ తో దూసుకుపోయిన స్టేజి నుంచి ఇప్పుడు ఒక్కొక్కటిగా అవకాశాలు, కాంబోలు మార్చే దశకు వచ్చిన నితిన్ నిజంగా అంజితో చేయి కలిపితే మంచి నిర్ణయం అవుతుంది.
ఎందుకంటే ట్రెండ్ కు తగ్గట్టు ఎంటర్ టైన్మెంట్ జోడిస్తే బడ్జెట్ తక్కువైనా బ్లాక్ బస్టర్లు సాధించవచ్చని గత ఏడాది కాలంలో చాలా సినిమాలు నిరూపించాయి. నితిన్ కూడా ఆ కోవలోనే హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on January 24, 2026 10:54 am
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…