Movie News

ఆచార్య సెట్లో అనుకోని అతిథి

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. కాజల్ అగర్వాల్ ‘ఆచార్య’ సినిమా సెట్లో అడుగు పెట్టింది. ఈ సినిమాకు కథానాయికను ఖరారు చేయడంలో విపరీతమైన జాప్యం జరగడం తెలిసిన సంగతే. చివరికి కాజల్‌ను కథానాయికగా ఎంచుకున్నాక.. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇంతలో చందమామ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె నటిస్తుందా లేదా.. ‘ఆచార్య’లో ఉంటుందా లేదా అన్న సందేహాలు కలిగాయి.

ఐతే ఈ సందేహాలకు తెరదించుతూ తాజాగా కాజల్ ‘ఆచార్య’ సెట్లోకి అడుగు పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే సమయంలో సెట్‌కు రావడంతో ఇక ఈ సినిమా చిత్రీకరణ బ్రేకుల్లేకుండా సాగిపోతున్నట్లే. గత నెలలోనే ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. హీరో హీరోయిన్లు లేకుండానే షూటింగ్ జరిగింది. చిరు ఇటీవలే చిత్రీకరణకు సిద్ధమయ్యారు. ఇప్పుడు కాజల్ కూడా సెట్లోకి అడుగు పెట్టేసింది.

‘ఆచార్య’ సెట్లోకి కాజల్ సింగిల్‌గా ఏమీ రాలేదు. తన భర్త గౌతమ్ కిచ్లును కూడా వెంటబెట్టుకుని వచ్చింది. పెళ్లి తర్వాత పాల్గొనబోతున్న తొలి సినిమా షూటింగ్ కావడంతో ఫార్మాలిటీ కోసం భర్తను కూడా కాజల్ తీసుకువచ్చి ఉండొచ్చు. చిరు కొత్త జంటను సాదరంగా ఆహ్వానించడం మాత్రమే కాదు.. వారితో కేక్ కూడా కట్ చేయించారు. ఇద్దరితో కాసేపు ముచ్చట్లు కూడా చెప్పారు. సంబంధిత ఫొటోలు కూడా ట్విట్టర్లోకి వచ్చేశాయి.

‘ఆచార్య’ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే వేసవికి విడుదల చేయాలన్నది దర్శకుడు కొరటాల శివ ప్లాన్. లాక్ డౌన్ టైంలో స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దుకుని, పక్కా షెడ్యూల్స్ వేసుకుని ఆయన చిత్రీకరణను పున:ప్రారంభించారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న రామ్ చరణ్ సైతం త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటాడని అంటున్నారు. చిరు కుటుంబానికి చెందిన కొణిదెల ప్రొడక్షన్స్‌తో కలిసి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతాన్నందిస్తున్నాడు.

This post was last modified on December 15, 2020 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

1 hour ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

2 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

2 hours ago

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

5 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

5 hours ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

8 hours ago