ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. కాజల్ అగర్వాల్ ‘ఆచార్య’ సినిమా సెట్లో అడుగు పెట్టింది. ఈ సినిమాకు కథానాయికను ఖరారు చేయడంలో విపరీతమైన జాప్యం జరగడం తెలిసిన సంగతే. చివరికి కాజల్ను కథానాయికగా ఎంచుకున్నాక.. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇంతలో చందమామ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె నటిస్తుందా లేదా.. ‘ఆచార్య’లో ఉంటుందా లేదా అన్న సందేహాలు కలిగాయి.
ఐతే ఈ సందేహాలకు తెరదించుతూ తాజాగా కాజల్ ‘ఆచార్య’ సెట్లోకి అడుగు పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే సమయంలో సెట్కు రావడంతో ఇక ఈ సినిమా చిత్రీకరణ బ్రేకుల్లేకుండా సాగిపోతున్నట్లే. గత నెలలోనే ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. హీరో హీరోయిన్లు లేకుండానే షూటింగ్ జరిగింది. చిరు ఇటీవలే చిత్రీకరణకు సిద్ధమయ్యారు. ఇప్పుడు కాజల్ కూడా సెట్లోకి అడుగు పెట్టేసింది.
‘ఆచార్య’ సెట్లోకి కాజల్ సింగిల్గా ఏమీ రాలేదు. తన భర్త గౌతమ్ కిచ్లును కూడా వెంటబెట్టుకుని వచ్చింది. పెళ్లి తర్వాత పాల్గొనబోతున్న తొలి సినిమా షూటింగ్ కావడంతో ఫార్మాలిటీ కోసం భర్తను కూడా కాజల్ తీసుకువచ్చి ఉండొచ్చు. చిరు కొత్త జంటను సాదరంగా ఆహ్వానించడం మాత్రమే కాదు.. వారితో కేక్ కూడా కట్ చేయించారు. ఇద్దరితో కాసేపు ముచ్చట్లు కూడా చెప్పారు. సంబంధిత ఫొటోలు కూడా ట్విట్టర్లోకి వచ్చేశాయి.
‘ఆచార్య’ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే వేసవికి విడుదల చేయాలన్నది దర్శకుడు కొరటాల శివ ప్లాన్. లాక్ డౌన్ టైంలో స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దుకుని, పక్కా షెడ్యూల్స్ వేసుకుని ఆయన చిత్రీకరణను పున:ప్రారంభించారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న రామ్ చరణ్ సైతం త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాడని అంటున్నారు. చిరు కుటుంబానికి చెందిన కొణిదెల ప్రొడక్షన్స్తో కలిసి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతాన్నందిస్తున్నాడు.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…