లాక్ డౌన్ టైంలో ఓటీటీ ఫ్లాట్ఫామ్స్కు విపరీతమైన ఆదరణ దక్కింది. జనాలందరూ వరుసబెట్టి వివిధ ఓటీటీల సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ ఫ్లాట్ ఫామ్స్ కూడా కొత్త సినిమాలను పెద్ద ఎత్తునే రిలీజ్ చేశాయి. ఐతే ఇలా ఓటీటీలు చెప్పిన రేటుకు సినిమాను ఇవ్వడం ఎందుకు.. మనమే సొంతంగా ఆన్లైన్లో రిలీజ్ చేసేద్దామని ఆన్ లైన్ థియేటర్లు తెరుచుకున్నారు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు.
ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కూడా ఇలా ఆన్ లైన్ థియేటర్ మొదలుపెట్టింది. పే పర్ వ్యూ పద్ధతిలో ఇందులో సినిమాలు రిలీజ్ చేశారు. ముందుగా రామ్ గోపాల్ వర్మనే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్, థ్రిల్లర్ అంటూ వరుసబెట్టి ఇందులో సినిమాలు వదిలాడు.
మొదట్లో కుర్రాళ్లు బాగానే డబ్బులు పెట్టి ఆయన సినిమాలు చూసినట్లు కనిపించింది. వర్మకు బాగానే గిట్టుబాటు అయింది. కానీ వీటిలో విషయం తక్కువ, పబ్లిసిటీ హడావుడి ఎక్కువ అని అర్థమై చూడ్డం మానేశారు. ఆ ప్రభావం వేరే పే పర్ వ్యూ సినిమాల మీదా పడింది. ఈ మధ్య ఇలా రిలీజ్ చేస్తున్న ఏ సినిమాకూ ఆశించిన స్పందన ఉండట్లేదు. తాను తెరకెక్కించిన నర్తనశాల లోంచి చిన్న వీడియో బిట్ తీసి నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేస్తే పెద్దగా స్పందన లేకపోయింది. వర్మ ఈ మధ్య ఇలా రిలీజ్ చేస్తున్న సినిమాల గురించి పట్టించుకునేవాళ్లే లేరు. వేరే సినిమాల పరిస్థితీ అంతే.
హిందీలో ఖాలీపీలి, తమిళంలో కపె రణసింగం లాంటి సినిమాలను పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తే అనుకున్నంతగా రెవెన్యూ రాలేదు. ఇప్పుడు తెలుగులో సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు రూపొందించిన డర్టీ హరిని ఈ శుక్రవారం ఆన్ లైన్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికైతే పెద్దగా బజ్ కనిపించట్లేదు. ఇందులోని బోల్డ్ కంటెంట్ చూసి ఏమైనా కుర్రాళ్లు ఎగబడతారేమో చూడాలి.
This post was last modified on December 15, 2020 12:07 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…