సంక్రాంతి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్’ క్లియర్ విన్నర్ అనడంలో మరో మాట లేదు. ఇక బడ్జెట్, వసూళ్ల లెక్కల్లో చూస్తే తర్వాతి స్థానం నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’నే. పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల వసూళ్ల మార్కును అందుకుని నవీన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రెండో వారంలోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడుతోంది.
ఈ సినిమాలో నటన పరంగా నవీన్ పొలిశెట్టిది వన్ మ్యాన్ షో అనడంలో సందేహం లేదు. రైటింగ్లోనూ తన పాత్ర ఎంతో కీలకం. ఐతే ఈ సినిమాకు స్క్రిప్టు రాసింది అతనొక్కడే కాదు. తనతో పాటు చిన్మయి ఘాట్రాజు అనే లేడీ రైటర్.. కథ, స్క్రీన్ ప్లే, మాటల క్రెడిట్ తీసుకుంది. అంతే కాక ఆమెకు క్రియేటివ్ డైరెక్టర్ అనే ఇంకో క్రెడిట్ కూడా ఇచ్చారు. ఇలా ఒక అమ్మాయి హీరోతో కలిసి స్క్రిప్టు రాయడం.. మేకింగ్లో కూడా భాగం కావడం అరుదైన విషయమే.
ఇంతకీ ఈ చిన్మయి ఘాట్రాజు ఎవరన్నది ఆసక్తికరం. ఆమె ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. 2012లో విడుదలైన ప్రవీణ్ సత్తారు తొలి చిత్రం ‘ఎల్బీడబ్ల్యూ’లో ఆమె ఒక కథానాయికగా నటించింది. ఇంకా లవ్లీ, మై హీరో కలామ్, చమ్మక్ చల్లో లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది చిన్మయి. కానీ తర్వాత నటిగా ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. ఆపై ఆమె రైటర్ అవతారం ఎత్తింది. నవీన్తో పరిచయం కావడం, అతడికి ఆమె రైటింగ్ స్టైల్ నచ్చడంతో ఇద్దరూ కలిసి ‘అనగనగా ఒక రాజు’ స్క్రిప్టు రాశారు.
నిజానికి ఇది ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయాల్సిన సినిమా. కానీ ఎందుకో అతను ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయింది కూడా. కానీ నవీన్ ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. చిన్మయితో కలిసి స్క్రిప్టు రాశాడు. ఆ తర్వాత ఈ చిత్రానికి తమిళుడైన మారిని దర్శకుడిగా ఎంచుకున్నారు. ఈ స్క్రిప్టుకు నిర్మాత నాగవంశీ పచ్చజెండా ఊపడంతో సినిమా ముందుకు కదిలింది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…