తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు నిర్మాతల్లోనే కాదు వివిధ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిర్మాతలు తొంభై రోజుల ముందే అప్లై చేసుకుని టికెట్ రేట్ల పెంపు తీసుకోవాలని తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాలకు ఇదో సవాల్ గా మారనుంది.
ఎందుకంటే ఫలానా తేదీకి రిలీజ్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజా సాబ్ అయినా ప్యారడైజ్ అయినా అన్నింటిది ఒకే కథ. కొన్నిసార్లు జన నాయకుడు లాంటి వాటికి సెన్సార్ నుంచే వచ్చే ఇబ్బందులు బోనస్ చిక్కులు తెచ్చి పెడతాయి. అలాంటప్పుడు అంత అడ్వాన్స్ ప్లాన్డ్ ఉండటం అనుకున్నంత సులభం కాదు.
ఇక్కడ ఓటిటిల వైపు నుంచి సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అగ్రిమెంట్ చేసుకునే టైంలోనే నిర్మాత ఫలానా తేదీకి రిలీజ్ చేస్తామని స్పష్టంగా పేర్కొంటారు. దానికి అనుగుణంగానే ఓటిటిలు వాటి ప్రీమియర్లను షెడ్యూల్ చేసుకుంటాయి. అప్పుడప్పుడు మార్పులు ఉంటాయి. ఏదైనా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తితే తప్ప మినహాయింపులు ఉండవు.
అలాంటప్పుడు జిఓ కోసం నిర్మాతలు కనక మూడు నెలల ముందు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే దాన్నే ఓటిటి ఒప్పందాల్లో చూపించుకోవాలి. దానికి కట్టుబడకపోతే ఇటు ప్రభుత్వం, కోర్టు అటు ఓటిటిలతో కొత్త ఇబ్బంది వచ్చి పడుతుంది. నిర్మాతల ఆందోళన ఇదే.
ఇప్పటికిప్పుడు దీని గురించి ఎలాంటి కంక్లూజన్స్ కు రాలేం కానీ ఏదైనా ప్యాన్ ఇండియా మూవీ విడుదల దగ్గరలో ఉన్నప్పుడు వీటి తాలూకు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. పెద్ది, ప్యారడైజ్ లాంటి బిగ్గీలతో పాటు టాక్సిక్ లాంటి డబ్బింగులు సైతం హైక్స్ కోరుకునేవే.
ఇదంతా ఒక రకమైన అయోమయానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదు. టికెట్ రేట్ల మీద మళ్ళీ ఎవరు కోర్టుకి వెళ్లినా అంత సులభంగా అయితే తేలదు. ముప్పై రోజుల నిడివి ఇచ్చి ఉంటే బాగుండేదని, కానీ మూడు నెలలు మరీ ఎక్కువ గడవని, ప్రాక్టికల్ గా చూస్తే ఇది మీట్ కావడం కొందరికే సాధ్యమని ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on January 21, 2026 1:15 pm
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…