తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు నిర్మాతల్లోనే కాదు వివిధ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిర్మాతలు తొంభై రోజుల ముందే అప్లై చేసుకుని టికెట్ రేట్ల పెంపు తీసుకోవాలని తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాలకు ఇదో సవాల్ గా మారనుంది.
ఎందుకంటే ఫలానా తేదీకి రిలీజ్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజా సాబ్ అయినా ప్యారడైజ్ అయినా అన్నింటిది ఒకే కథ. కొన్నిసార్లు జన నాయకుడు లాంటి వాటికి సెన్సార్ నుంచే వచ్చే ఇబ్బందులు బోనస్ చిక్కులు తెచ్చి పెడతాయి. అలాంటప్పుడు అంత అడ్వాన్స్ ప్లాన్డ్ ఉండటం అనుకున్నంత సులభం కాదు.
ఇక్కడ ఓటిటిల వైపు నుంచి సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అగ్రిమెంట్ చేసుకునే టైంలోనే నిర్మాత ఫలానా తేదీకి రిలీజ్ చేస్తామని స్పష్టంగా పేర్కొంటారు. దానికి అనుగుణంగానే ఓటిటిలు వాటి ప్రీమియర్లను షెడ్యూల్ చేసుకుంటాయి. అప్పుడప్పుడు మార్పులు ఉంటాయి. ఏదైనా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తితే తప్ప మినహాయింపులు ఉండవు.
అలాంటప్పుడు జిఓ కోసం నిర్మాతలు కనక మూడు నెలల ముందు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే దాన్నే ఓటిటి ఒప్పందాల్లో చూపించుకోవాలి. దానికి కట్టుబడకపోతే ఇటు ప్రభుత్వం, కోర్టు అటు ఓటిటిలతో కొత్త ఇబ్బంది వచ్చి పడుతుంది. నిర్మాతల ఆందోళన ఇదే.
ఇప్పటికిప్పుడు దీని గురించి ఎలాంటి కంక్లూజన్స్ కు రాలేం కానీ ఏదైనా ప్యాన్ ఇండియా మూవీ విడుదల దగ్గరలో ఉన్నప్పుడు వీటి తాలూకు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. పెద్ది, ప్యారడైజ్ లాంటి బిగ్గీలతో పాటు టాక్సిక్ లాంటి డబ్బింగులు సైతం హైక్స్ కోరుకునేవే.
ఇదంతా ఒక రకమైన అయోమయానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదు. టికెట్ రేట్ల మీద మళ్ళీ ఎవరు కోర్టుకి వెళ్లినా అంత సులభంగా అయితే తేలదు. ముప్పై రోజుల నిడివి ఇచ్చి ఉంటే బాగుండేదని, కానీ మూడు నెలలు మరీ ఎక్కువ గడవని, ప్రాక్టికల్ గా చూస్తే ఇది మీట్ కావడం కొందరికే సాధ్యమని ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…