ఇటీవల పూజా హెగ్డే ఒక స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ తిరుగుతోంది. ఒక పాన్ ఇండియా సినిమా షూటింగ్ టైమ్లో ఒక టాప్ హీరో తన పర్మిషన్ లేకుండా క్యార్ వాన్లోకి వచ్చారని, దానికి తాను గట్టిగా వార్నింగ్ ఇచ్చానని పూజ అన్నట్లు కథనాలు గట్టిగానే అల్లేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ల ప్రకారం.. ఆ గొడవ తర్వాత సదరు హీరో పూజతో మళ్ళీ వర్క్ చేయడానికి ఇష్టపడలేదని, కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు అవేవీ ముఖ్యం కాదని ఆమె చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.
కొన్ని వెబ్ సైట్లు అయితే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పూజ స్వయంగా వెల్లడించినట్లు కథనాలు అల్లేశాయి. దీనితో ఆ హీరో ఎవరై ఉంటారా అని నెటిజన్లు రకరకాలుగా గెస్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో అసలు వాస్తవం ఎంత ఉందనేది పరిశీలిస్తే షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి.
నిజానికి పూజా హెగ్డే ఇటీవల ఎక్కడా ఇలాంటి కామెంట్స్ చేసినట్లు ఆధారాలు లేవు. ఆమె పాల్గొన్న ఏ ఇంటర్వ్యూలో గానీ లేదా సోషల్ మీడియా అకౌంట్స్ లో గానీ ఇలాంటి మాటలు అన్నట్లు వీడియోలు ఎక్కడా కనిపించడం లేదు.
కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది కేవలం కావాలని ఎవరో సృష్టించిన ఫేక్ న్యూస్ మాత్రమే అని తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీల గురించి చిన్న గాసిప్ దొరికినా సోషల్ మీడియాలో కథలు అల్లడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎవరో క్రియేట్ చేసిన ఫేక్ పోస్ట్ వల్లే నిజానిజాలు తెలుసుకోకుండానే వైరల్ చేశారని అనిపిస్తోంది.
ఒక ప్రొఫెషనల్ నటిగా పూజ ఇప్పటివరకు ఎందరో స్టార్ హీరోలతో పని చేశారు కానీ, ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు వచ్చినట్లు ఆమె చెప్పలేదు. ఇక పూజా హెగ్డే టీమ్ కూడా పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం అమ్మడు తన కొత్త సినిమాల పనులతో బిజీగా ఉంది. నెక్స్ట్ జననాయగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 20, 2026 8:26 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…