మెగా ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. భారీ డిజాస్టర్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఓజితో, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారుతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాక నెక్స్ట్ రామ్ చరణ్ పెద్ది కోసం ఎదురు చూస్తున్నారు. దీని ఇన్ సైడ్ టాక్ కనక నిజమైతే మరో ఇండస్ట్రీ హిట్ రాబోతున్నట్టే.
ఈ క్రమంలో ఇతర మెగా హీరోలు కూడా సక్సెస్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళలో వరుణ్ తేజ్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. హ్యాట్రిక్ డిజాస్టర్లతో తన ఇమేజ్, మార్కెట్ రెండూ రిస్క్ లో పెట్టుకున్న ఈ మెగా ప్రిన్స్ త్వరలో కొరియన్ కనకరాజుగా రాబోతున్నాడు. ఇవాళ క్యారెక్టర్ పరిచయం చేస్తూ టీజర్ వదిలారు.
కథేంటో చెప్పలేదు కానీ చిన్న క్లూ ఇచ్చారు. కొరియా దేశంలో ఇరుకున్న సత్యను కనకరాజు జాడ చెప్పమని అక్కడి పోలీసులు తీవ్రంగా వేధిస్తూ ఉంటారు. ఊహించని విధంగా కత్తి పట్టుకుని కనకరాజు అక్కడికి వచ్చి రక్తపాతం సృష్టిస్తాడు. దెయ్యం లాంటి కళ్ళతో అందరినీ భయపెడతాడు.
తీరా చూస్తే అతను ఒరిజినల్ కాదని సత్య గుర్తిస్తాడు. దానికి ముందు వెనుకా ఏం జరిగిందనేది ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ కామెడీ హారర్ కు తమన్ సంగీతం సమకూర్చారు. విజువల్స్ సింపుల్ గా ఉన్నాయి కానీ బిజిఎం భయపెట్టేలా సాగింది.
ఇండియన్ దెయ్యాలు ఆత్మలు బోర్ కొట్టేశాయి కాబట్టి ఇప్పుడు కొరియన్ వైపు వెళ్ళిపోయింది కనకరాజు టీమ్. మిరాయ్ ఫేమ్ రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. ఇదే యువి నిర్మిస్తున్న విశ్వంభర వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాక కనకరాజుకి ముహూర్తం ఫిక్స్ చేయొచ్చు.
పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న కొరియన్ కనకరాజులో కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని యూనిట్ టాక్. గద్దలకొండ గణేష్ తర్వాత మాస్ ని పక్కన పెట్టేసిన వరుణ్ తేజ్ తిరిగి పెదనాన్న, బాబాయ్ రూటుకు వచ్చేశాడు. మరి తను కోరుకున్న విజయం దక్కుతుందేమో చూడాలి.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…