Movie News

2026లో చిరు… ట్రిపుల్ ధమాకా?

పదేళ్ల విరామం తర్వాత సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. వేగంగానే సినిమాలు చేసుకుంటూ వచ్చారు కానీ.. తన చివరి చిత్రం ‘భోళా శంకర్’ రిలీజయ్యాక మాత్రం అనుకోకుండా చాలా గ్యాప్ వచ్చేసింది. ‘విశ్వంభర’ వాయిదా పడిపోవడంతో దాదాపు రెండున్నరేళ్ల పాటు ఆయన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విడుదలైంది. మెగా అభిమానులు ఆశించిన దాని కంటే పెద్ద విజయం దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది. 

విశేషం ఏంటంటే.. రెండున్నరేళ్ల పాటు వచ్చిన గ్యాప్‌ను కవర్ చేసేలా చిరు ఈ ఏడాది ఇంకో రెండు చిత్రాలతో పలకరించబోతున్నాడు. గత ఏడాదే రావాల్సిన ‘విశ్వంభర’ను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసమే దాన్ని మరింత వెనక్కి జరిపారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తాపీగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. బెస్ట్ ఔట్ పుట్‌తో సమ్మర్ మధ్యలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

మరోవైపు ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత ఖాళీ అయిపోతున్న చిరు.. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాబీ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ఆ సినిమాకు పక్కాగా స్క్రిప్టు రెడీ అయిపోయింది. షెడ్యూళ్లు కూడా వేసేశారు. మరి కొన్ని రోజుల్లోనే చిత్రీకరణ మొదలు కానుంది. బాబీ స్పీడుగానే సినిమా తీస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా లేదా దీపావళికే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతానికి వచ్చే ఏడాది సంక్రాంతి అంటున్నారు కానీ షూటింగ్ పనులు వేగంగా జరిగిపోతే దీపావళి లోపే వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలెం.

అదే జరిగితే ఒకే ఏడాది మూడు చిత్రాలతో చిరు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే అనూహ్యమే. కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. బహుశా టాలీవుడ్ టాప్ స్టార్లలో ఎవరికీ ఈ రికార్డు ఉండదేమో. ఐతే ఈ రికార్డు చిరు సొంతమవుతుందా లేదా అన్నది బాబీ చేతుల్లోనే ఉంది. ఈ ఏడాది చివరిలోపు ఈ చిత్రాన్ని విడుదల చేయలేని పక్షంలో వచ్చే ఏడాది కూడా సంక్రాంతికే చిరు బరిలో నిలిచే అవకాశముంది.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

11 hours ago