జరిగేదంతా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. ఇది ఎంత నిజమో ప్రాక్టికల్ గా కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. జన నాయకుడు వాయిదా పడి కోర్టుల చుట్టూ తిరగడం తెలిసిన సంగతే. ఒకవేళ ఎలాంటి అడ్డంకులు లేకుండా జనవరి 9 తమిళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా రిలీజయ్యుంటే ఖచ్చితంగా రాద్ధాంతం జరిగేది.
ఎలా అనేది అర్థం కావాలంటే కొంచెం డీటెయిల్డ్ గా వెళ్ళాలి. పోస్ట్ పోన్ కన్నా ముందు జన నాయకుడుకి ఏపీ తెలంగాణలో స్క్రీన్ అలాట్మెంట్ జరిగిపోయింది. పివిఆర్ ఐనాక్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడంతో అధిక శాతం దాని మల్టీప్లెక్సుల్లోనే షోలు పడేలా ప్లాన్ చేసుకున్నారు.
భగవంత్ కేసరి పాక్షిక రీమేక్ అని తెలిసినా సరే ఇక్కడ విడుదలకు ఏర్పాట్లు చేసుకున్నారు. సరే మిస్ అవ్వడం ఎంత మంచిది అయ్యిందో చూద్దాం. ఉదాహరణకు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ సప్తగిరి 70 ఎంఎం థియేటర్ ని తొలుత జన నాయకుడికి ఇచ్చారు. ఇప్పుడు దాని స్థానంలో నారి నారి నడుమ మురారి హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది.
ఒకవేళ డబ్బింగ్ మూవీ చెప్పిన డేట్ కి వచ్చి ఉంటే మన శర్వానంద్ కు ఒక పెద్ద స్క్రీన్ తగ్గేది. ఇక పివిఆర్ చైన్ లో ఎన్నో స్క్రీన్లు, కేవలం విజయ్ రాకపోవడం వల్ల మిగిలిన వాటికి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకున్నాయి. ఇక్కడ ఇంకో కోణం చూడాలి.
మన శంకరవరప్రసాద్ గారు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కొన్ని ఏరియాల్లో సరిపడా థియేటర్లు ఇవ్వడం లేదని మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో అనగనగా ఒక రాజుతో సమానంగా పంపకాలు చేయడం లాంటివి వాళ్లకు నచ్చలేదు.
ఎవరి బిజినెస్ వారిదే కాబట్టి ఇక్కడ ఎవరిని తప్పుబట్టడానికి లేదు కానీ, తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వాటిలో అవి ఎంతైనా కొట్టుకున్నా పర్వాలేదు కానీ మధ్యలో డబ్బింగులు కూడా దూరితే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇక జన నాయకుడు ఎప్పుడు ఏ డేట్ కు వచ్చినా ఇబ్బంది లేదు. అప్పటికంతా సంక్రాంతి సినిమాల ఫైనల్ రన్ దగ్గరలో ఉంటుంది.
This post was last modified on January 18, 2026 5:56 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…