బాక్సాఫీస్ వద్ద మన శంకరవరప్రసాద్ గారి తుఫాను కొనసాగుతోంది. మూడు రోజులకే నూటా యాభై కోట్ల మార్కుని దాటేసిన మెగాస్టార్ వీకెండ్ లోపు డబుల్ సెంచరీని టచ్ చేయడం ఖాయమే. మొదటి వారం కాకుండానే ఇంత ఊచకోత చూసి మెగాభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.
యుఎస్ లో థియేటర్ ఇష్యూస్ కొంతవరకు ఇబ్బందిగా మారినప్పటికీ రెండు మిలియన్ల మైలురాయిని అందుకున్న వరప్రసాద్, బుక్ మై షోలో వేగంగా 20 లక్షల టికెట్లు అమ్మిన తొలి రీజనల్ మూవీగా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఏపీ తెలంగాణ బిసి సెంటర్లలో జరుగుతున్న విధ్వంసం అర్థం కావాలంటే ఎక్స్, ఇన్స్ టా వీడియోలు చూస్తే చాలు.
సలార్ లో ప్రభాస్ విలన్ మీదకు వెళ్తున్నప్పుడు పృథ్విరాజ్ సుకుమారన్ ని ఉద్దేశించి పక్కన ఉన్న వాళ్ళు వరదా వాడిని ఆపు అంటారు. ఇప్పుడు వరప్రసాద్ వ్యవహారం అచ్చం ఇలాగే ఉంది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని చిరంజీవి ఈ స్థాయిలో కంబ్యాక్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు.
అనిల్ రావిపూడి అనే బ్రాండ్ ఉన్నప్పటికీ జెన్ జీని ఇద్దరూ మెప్పించగలరా అనే డౌట్ కొన్ని వర్గాల్లో ఉండేది. వాటిని పూర్తిగా పటాపంచలు చేస్తూ ఇంత పెద్ద సునామి సృష్టించడం అనూహ్యం. పోటీ కనక కొంచెం తగ్గి ఉంటే చాలా చోట్ల ఏకంగా రాజమౌళి నెంబర్లనే టార్గెట్ చేసుకుని ఉండేవాళ్ళేమో. కానీ ఆ ఛాన్స్ మిస్.
ప్యాన్ ఇండియా టచ్ లేని సింగల్ లాంగ్వేజ్ మూవీ ఇంత రచ్చ చేయడం మాత్రం గొప్ప విషయమని చెప్పాలి. ఇక్కడ చెప్పిందంతా కొంత అతిశయోక్తిగా కొందరికి అనిపించవచ్చేమో కానీ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో రాజమౌళి ఆస్కార్ దాకా ఎలాగైతే తీసుకెళ్తున్నారో, అలాగే ఇతర బాషల అవసరం లేకుండా ఒక ఫ్యామిలీ కంటెంట్ తో బ్లాక్ బస్టర్ ఎలా ఇవ్వాలో అనిల్ రావిపూడి చూపిస్తున్నాడు.
పండగ జోష్ ఇంకా మూడు రోజులు ఉంది. ఆదివారం దాకా ఈ జోరులో ఒక్క శాతం కూడా ఎలాంటి మార్పు ఉండదు. తర్వాత పెరిగిన టికెట్ల రేట్లు ఆంధ్రప్రదేశ్ లో సాధారణ స్థితికి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు సెకండ్ రౌండ్ బ్యాటింగ్ ఉంటుంది.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…