వరసగా తొమ్మిదో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మేఘాల్లో తేలిపోతున్నారు. సక్సెస్ ఊహించిందే అయినా మరీ ఇలా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో విజయం సాధిస్తుందని ట్రైలర్ వచ్చినప్పుడు అభిమానులే అనుకోలేదు.
కాంపిటీషన్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే మెగా సింహాసనం నాదే అంటూ చిరంజీవి సాగిస్తున్న బాక్సాఫీస్ వేట అంత ఈజీగా ఆగేలా లేదు. ఈ క్రెడిట్ లో సింహభాగం రావిపూడికే దక్కుతుంది. అయితే తన నెక్స్ట్ మూవీ ఏదనే ఎగ్జైట్ మెంట్ మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. దానికి సమాధానం నేరుగా కాదు కానీ ఇన్ డైరెక్ట్ గా తాజా ఇంటర్వ్యూలో దొరికింది.
మన శంకరవరప్రసాద్ విక్టరీని సెలెబ్రేట్ చేసుకోవడానికి చిరు, వెంకీ, రావిపూడి కలిసి మెగాస్టార్ ఇంట్లో ఒక స్పెషల్ పార్టీ చేసుకుని సరదా ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఎన్నో సరదా కబుర్లు అందులో దొర్లాయి.
చివర్లో చిరంజీవి మాట్లాడుతూ వెంకటేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి కనక తనకు ఏదైనా క్యామియో ఆఫర్ చేసినా లేదా ఫుల్ లెన్త్ రోల్స్ తో ఇద్దరినీ బ్యాలన్స్ చేసేలా కథ రాసుకుని వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించేశారు. దానికి పక్కనే ఉన్న వెంకీ కూడా సానుకూలంగా స్పందించడంతో నిప్పు లేనిదే పొగరాదు సామెత గుర్తుకు వస్తోంది. ఏదో హింట్ లేనిదే చిరు అలా మాట్లాడరు కదా.
ఆదర్శ కుటుంబం, దృశ్యం 3 తర్వాత వెంకటేష్ చేయబోయే మూవీ అనిల్ రావిపూడితోనే అన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుస. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ని సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారనే లీక్ కొన్ని వారాలుగా చక్కర్లు కొడుతోంది. అయితే అనిల్ దాని ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఒకవేళ నిజమే అయిన పక్షంలో సంక్రాంతికి వస్తున్నాం 2లో మెగా స్పెషల్ అప్పియరెన్స్ చూసే ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పటికైతే దీన్ని ముందస్తు ఊహాగానాలు అనుకోవచ్చు కానీ నిజమైనా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. చిరంజీవికి అంత గొప్ప మైలురాయిని రావిపూడి కానుకగా ఇచ్చాడు మరి.
This post was last modified on January 16, 2026 8:07 am
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…