శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’తో అతను హిట్టు కొడతాడనే నమ్మకాలు కలుగుతున్నాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్గా కనిపించాయి. ఐతే ఈ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పబ్లిసిటీ లేటుగా మొదలుపెట్టారు. తనకు హిట్ చాలా అవసరమైన దశలో శర్వా ప్రమోషన్ పరంగా ఇంకా చురుగ్గా ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతనెందుకు అంత యాక్టివ్గా లేడనే విషయంలో కొంత సందేహాలు కలుగుతున్నాయి. దర్శక నిర్మాతలతో ఏమైనా చెడిందా అనే డౌట్లూ కొడుతున్నాయి. ఇదే విషయాన్ని నిర్మాత అనిల్ సుంకరను అడిగితే.. ఆ అనుమానాలను సింపుల్గా కొట్టిపడేశారు. శర్వాతో ఏ ఇబ్బందీ లేదని తేల్చేశారు.
సినిమాకు ప్రమోషన్ పరంగా సహకరించడంలో తాను పని చేసిన హీరోలందరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ శర్వా అని అనిల్ సుంకర తేల్చేశారు. తాను ఇంతకుముందు శర్వాతో ‘మహాసముద్రం’ సినిమా కూడా తీశానని.. అప్పుడు కానీ, ఇప్పుడు కానీ అతను పూర్తిగా సహకరించాడని.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
శర్వా వేరే చోట ఉండడం వల్ల ప్రెస్ మీట్లో పాల్గొనలేదని.. ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని.. ఈవెంట్లలో పాల్గొంటున్నాడని.. సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతా పడుతున్నాడని అనిల్ స్పష్టం చేశారు. ‘నారీ నారీ నడుమ మురారి’ శర్వా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఫిలింగా నిలుస్తుందని.. తన సంస్థకూ ఘనవిజయాన్ని అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5.49 షోలతో విడుదలవుతోంది. ఈ చిత్రంతో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.
This post was last modified on January 13, 2026 2:29 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…