శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’తో అతను హిట్టు కొడతాడనే నమ్మకాలు కలుగుతున్నాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్గా కనిపించాయి. ఐతే ఈ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పబ్లిసిటీ లేటుగా మొదలుపెట్టారు. తనకు హిట్ చాలా అవసరమైన దశలో శర్వా ప్రమోషన్ పరంగా ఇంకా చురుగ్గా ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతనెందుకు అంత యాక్టివ్గా లేడనే విషయంలో కొంత సందేహాలు కలుగుతున్నాయి. దర్శక నిర్మాతలతో ఏమైనా చెడిందా అనే డౌట్లూ కొడుతున్నాయి. ఇదే విషయాన్ని నిర్మాత అనిల్ సుంకరను అడిగితే.. ఆ అనుమానాలను సింపుల్గా కొట్టిపడేశారు. శర్వాతో ఏ ఇబ్బందీ లేదని తేల్చేశారు.
సినిమాకు ప్రమోషన్ పరంగా సహకరించడంలో తాను పని చేసిన హీరోలందరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ శర్వా అని అనిల్ సుంకర తేల్చేశారు. తాను ఇంతకుముందు శర్వాతో ‘మహాసముద్రం’ సినిమా కూడా తీశానని.. అప్పుడు కానీ, ఇప్పుడు కానీ అతను పూర్తిగా సహకరించాడని.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
శర్వా వేరే చోట ఉండడం వల్ల ప్రెస్ మీట్లో పాల్గొనలేదని.. ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని.. ఈవెంట్లలో పాల్గొంటున్నాడని.. సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతా పడుతున్నాడని అనిల్ స్పష్టం చేశారు. ‘నారీ నారీ నడుమ మురారి’ శర్వా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఫిలింగా నిలుస్తుందని.. తన సంస్థకూ ఘనవిజయాన్ని అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5.49 షోలతో విడుదలవుతోంది. ఈ చిత్రంతో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.
This post was last modified on January 13, 2026 2:29 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…