దర్శకుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అయోమయం ఇంకా తొలగడం లేదు. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ప్రకటించి ఏడాది దాటేసింది. రిషబ్ శెట్టి హీరోగా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు.
కాంతార చాప్టర్ 1 తర్వాత తాను చేయబోయే మూవీ ఇదేనని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ తాజా పరిణామాలు చూస్తే జై హనుమాన్ కన్నా ముందు ఛత్రపతి శివాజీ బృందంతో రిషబ్ శెట్టి చేరబోతున్నాడని అర్థమవుతోంది. దానికి కారణాలు లేకపోలేదు.
ఇటీవలే కర్ణాటకలో జరిగిన ఒక డివోషనల్ ఈవెంట్ కి వివేక్ ఒబేరాయి అతిథిగా వచ్చాడు. రిషబ్ సాదరంగా ఆహ్వానించడమే కాక పరస్పరం ఇద్దరూ సన్మానించుకుని గౌరవం ప్రకటించుకున్నారు. ఛత్రపతి శివాజీలో వివేక్ ఒబెరాయ్ ఉండటం గమనించాల్సిన విషయం. అంటే జై హనుమాన్ పక్కకు వెళ్లి ఇది ముందుకు వచ్చిందనే అనుమానం వస్తోంది.
ప్రస్తుతం రిషబ్ శెట్టి చాలా టైట్ కమిట్మెంట్స్ లో ఉన్నాడు. జై హనుమాన్ కాకుండా మరో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ఒప్పుకున్నాడు. వాటిలో సితార ఎంటర్ టైన్మెంట్స్ తీయబోయే భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిపోతోంది.
ఒకవేళ జై హనుమాన్ ఆలస్యమయ్యే పక్షంలో ప్రశాంత్ వర్మ ఏం చేస్తాడనేది అంతు చిక్కని ప్రశ్న. ఆల్రెడీ రణ్వీర్ సింగ్ ప్రాజెక్టు చేయి జారింది. ఓపెనింగ్ దాకా రాబోయిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ క్యాన్సిల్ అయ్యింది. కొన్ని నెలల క్రితం నిర్మాత నిరంజన్ రెడ్డితో ఆర్థిక లావాదేవీలా గురించి నోటీసుల పర్వం కొనసాగింది.
ఫిలిం ఛాంబర్ లో ఇంకా పంచాయితీ తెగలేదట. ఇంత సందిగ్ధం ఉన్నా తన పర్యవేక్షణలో ఇతర దర్శకులతో ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భాగంగా తీస్తున్న ఇతర సినిమాలు నిక్షేపంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి జై హనుమాన్ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో చూడాలి.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…