దర్శకుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అయోమయం ఇంకా తొలగడం లేదు. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ప్రకటించి ఏడాది దాటేసింది. రిషబ్ శెట్టి హీరోగా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు.
కాంతార చాప్టర్ 1 తర్వాత తాను చేయబోయే మూవీ ఇదేనని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ తాజా పరిణామాలు చూస్తే జై హనుమాన్ కన్నా ముందు ఛత్రపతి శివాజీ బృందంతో రిషబ్ శెట్టి చేరబోతున్నాడని అర్థమవుతోంది. దానికి కారణాలు లేకపోలేదు.
ఇటీవలే కర్ణాటకలో జరిగిన ఒక డివోషనల్ ఈవెంట్ కి వివేక్ ఒబేరాయి అతిథిగా వచ్చాడు. రిషబ్ సాదరంగా ఆహ్వానించడమే కాక పరస్పరం ఇద్దరూ సన్మానించుకుని గౌరవం ప్రకటించుకున్నారు. ఛత్రపతి శివాజీలో వివేక్ ఒబెరాయ్ ఉండటం గమనించాల్సిన విషయం. అంటే జై హనుమాన్ పక్కకు వెళ్లి ఇది ముందుకు వచ్చిందనే అనుమానం వస్తోంది.
ప్రస్తుతం రిషబ్ శెట్టి చాలా టైట్ కమిట్మెంట్స్ లో ఉన్నాడు. జై హనుమాన్ కాకుండా మరో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ఒప్పుకున్నాడు. వాటిలో సితార ఎంటర్ టైన్మెంట్స్ తీయబోయే భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిపోతోంది.
ఒకవేళ జై హనుమాన్ ఆలస్యమయ్యే పక్షంలో ప్రశాంత్ వర్మ ఏం చేస్తాడనేది అంతు చిక్కని ప్రశ్న. ఆల్రెడీ రణ్వీర్ సింగ్ ప్రాజెక్టు చేయి జారింది. ఓపెనింగ్ దాకా రాబోయిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ క్యాన్సిల్ అయ్యింది. కొన్ని నెలల క్రితం నిర్మాత నిరంజన్ రెడ్డితో ఆర్థిక లావాదేవీలా గురించి నోటీసుల పర్వం కొనసాగింది.
ఫిలిం ఛాంబర్ లో ఇంకా పంచాయితీ తెగలేదట. ఇంత సందిగ్ధం ఉన్నా తన పర్యవేక్షణలో ఇతర దర్శకులతో ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భాగంగా తీస్తున్న ఇతర సినిమాలు నిక్షేపంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి జై హనుమాన్ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో చూడాలి.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…