నవీన్ పొలిశెట్టి చాలా ఏళ్ల ముందు మొదలుపెట్టిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. అతను ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కంటే ముందే ఈ సినిమాను అనౌన్స్ చేశాడు. అప్పటికి ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ను ఈ చిత్రానికి దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఏవో కారణాలతో ఆ సినిమాకు బ్రేక్ పడింది. తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చేసి హిట్టు కొట్టాడు. ‘అనగనగా ఒక రాజు’ ఇక ముందుకు కదలదని, నవీన్ వేరే సినిమ ా చేస్తాడనే అంతా అనుకున్నారు.
కానీ అందరికీ షాకిస్తూ ఈ సినిమాను మళ్లీ ముందుకు కదిలించాడు. ఈసారి మారి అనే కొత్త వ్యక్తి దర్శకుడి పాత్రలోకి రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా కొన్ని నెలల ముందే పూర్తయింది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఎప్పట్లాగే తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తూ సినిమాను ఆడియన్స్కు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నవీన్. సంక్రాంతి చిత్రాల్లో దీనంత ప్రమోషన్లు మరే సినిమాకూ లేకపోవడం విశేషం. నవీన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు.
ఐతే ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్లలో ఎక్కడా దర్శకుడు మారి కనిపించడం లేదు. అంతే కాక నవీన్ దర్శకుడి ప్రస్తావన కూడా తేవట్లేదు. మరోవైపు నిర్మాత నాగవంశీ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలిస్తుండగా.. అతనూ దర్శకుడి ప్రస్తావన తేవట్లేదు. ఈ సినిమాకు సంబంధించి మొత్తం క్రెడిట్ నవీన్కే ఇస్తున్నాడు. నవీన్ సొంతంగా రైటింగ్ టీంను పెట్టుకుని అదిరిపోయే లెవెల్లో స్క్రిప్టు రెడీ చేశాడని.. సినిమాలో కామెడీ సీన్లు ఇరగదీశాడని.. క్లైమాక్స్ కూడా చాలా బాగా చేశాడని అంటున్నాడు. అంతే తప్ప దర్శకుడి గురించి మాట్లాడట్లేదు.
ఈ సినిమాకు నవీన్ ఘోస్ట్ డైరెక్షన్ చేశాడనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పేరుకు ఒక దర్శకుడిని పెట్టుకుని అంతా నవీనే నడిపించాడని.. అందుకే డైరెక్టర్ బయటికి రావట్లేదని.. తన గురించి హీరో, నిర్మాత కూడా ఎక్కడా మాట్లాడట్లేదని అంటున్నారు. మరి ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో అయినా దర్శకుడు కనిపిస్తాడా.. సినిమా గురించి మాట్లాడతాడా.. తనకు టీం క్రెడిట్ ఇస్తుందా.. అన్నది చూడాలి.
This post was last modified on January 6, 2026 8:08 am
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…