రాజా సాబ్ విడుదలకు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉంది. జనవరి 8 రాత్రి వేసే ప్రీమియర్ల అప్డేట్స్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వైపు నుంచి అనుమతులు చివరి నిమిషం దాకా ఎక్కడ ఒత్తిడి పెడతాయోననే టెన్షన్ ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది.
సినిమాటోగ్రఫీ మంత్రికి లేఖ రాసి అందులో ప్రీమియర్లకు గాను మల్టీప్లెక్సు వెయ్యి రూపాయలు, సింగల్ స్క్రీన్ ఎనిమిది వందలు ఫ్లాట్ రేట్ పెట్టమని కోరినట్టుగా ఉన్న లెటర్ బయటికి వచ్చింది. ఇక రెగ్యులర్ షోలకు సైతం పెంపును అభ్యర్థిస్తూ దానికి గల కారణాలు సవివరంగా అందులో పొందుపరిచి ఉన్నాయి.
ఏపీలో సమస్య లేదు. ఓజి, అఖండ 2కే కాదు కూలి, కాంతార చాప్టర్ 1 లాంటి డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు కాబట్టి రాజా సాబ్ కి లేట్ చేయడం ఉండదు. కాకపోతే నైజాంలో బెనిఫిట్ షోలు పడతాయా లేదా అనేది కీలకం. ఎవరో ఒకరు కోర్టు కేసులు వేయడం, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి రావడం ఇదంతా ప్రతిసారి ఒక తతంగంలా అయిపోయింది.
ఈసారి సాంకేతికంగా అలాంటి ఇబ్బందులు రాకుండా ఏం చేయొచ్చనే దాని గురించి మంత్రి బృందంలోని అధికారులు కసరత్తు చేస్తున్నారట. ఒకవేళ అడిగినంత హైక్ ఇవ్వకపోతే ఏం చేస్తారనే సస్పెన్స్ మూవీ లవర్స్ ని విపరీతంగా నలిపేస్తోంది.
ఇప్పటికైతే రాజా సాబ్ నుంచి అన్ని ప్రమోషన్లు పూర్తయిపోయాయి. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఆడిపాడిన సాంగ్ ఏకంగా వీడియో రూపంలో వచ్చేసింది. కోరుకున్న దానికన్నా చాలా ఎక్కువ కంటెంట్ ఇచ్చేశారు కాబట్టి ఇక బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ చేయబోయే రాంపేజ్ చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవ్వాలి.
సంక్రాంతికి అందరికంటే ముందు వస్తున్న నేపథ్యంలో టాక్ చాలా కీలకం కానుంది. ఓపెనింగ్స్ అదిరిపోతాయి కానీ టాక్ నిలవడం చాలా ముఖ్యం. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఆందోళన ఉండదు. అదే జరగాలని అభిమానులు దేవుళ్ళకు దండాలు పెట్టేసుకుంటున్నారు.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…