నిన్న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అభిమానుల వరకు బాగుందనిపించింది కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో కొంత మిస్సైన ఫీలింగ్ సోషల్ మీడియాలో చూపించారు. చిరంజీవి కామిక్ టైమింగ్ ని బయటికి తీసినట్టు అనిపించినా కేవలం రెండు మూడు డైలాగులతో సరిపెట్టేసి బ్యాక్ గ్రౌండ్ లో బాస్ బాస్ అంటూ హోరెత్తించడం తప్ప భీమ్స్ చేసింది ఏమి లేదనే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి.
పైగా మేకింగ్ క్వాలిటీ మీద కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రెండున్నర నిమిషాల్లో వింటేజ్ చిరంజీవిని పరిచయం చేయాలనే తాపత్రయమే ఎక్కువ బయట పడటం కాదనలేని వాస్తవం.
ఇది చూసాక ప్రధానంగా కలుగుతున్న సందేహం ఒకటే. అసలు కంటెంట్ ని అనిల్ రావిపూడి దాచారేమోనని. ఎందుకంటే మాములుగా ట్రైలర్ ని బట్టే ఆడియన్స్ ఏ సినిమాకైనా ఒక అంచనాకు వచ్చేస్తారు. వాల్తేరు వీరయ్య విషయంలో జరిగింది అదే. దాని కట్ పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో ఆడియన్స్ కి ముందే క్లారిటీ వచ్చేసింది.
రాజా సాబ్ కు రెండు టీజర్లు, ఒక ట్రైలర్ తర్వాత మళ్ళీ మూడో టీజర్ సిద్ధం చేయడం వెనుక రీజన్ జనాన్ని ప్రిపేర్ చేయడం కోసమే. కానీ అలాంటి కసరత్తు మన శంకరవరప్రసాద్ గారుకి జరగలేదనేది అభిమానుల మధ్య జరుగుతున్న చర్చ.
ఆన్ లైన్ పక్కనపెడితే గ్రౌండ్ లెవెల్ లో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోతో పాటు వెంకటేష్ క్యామియో లాంటి ఎలిమెంట్స్ మంచి అంచనాలు సృష్టించి పెట్టాయి. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సినిమా కావడంతో అంతకు మించి ఆశిస్తున్నారు మూవీ లవర్స్. వాటిని అనిల్ రావిపూడి అందుకోవాల్సిందే.
ఎందుకంటే పోటీలో ఉన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు అన్నీ వినోద ప్రధానంగా తీసిన సినిమాలే. మన శంకరవరప్రసాద్ గారు వాటి కన్నా మెరుగ్గా ఉందనిపించుకుంటేనే రేసులో ఫస్ట్ వస్తుంది. రాజా సాబ్ హారర్ జానర్ అందులోనూ ప్రభాస్ మూవీ కాబట్టి దాని క్యాలికులేషన్ వేరు.
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…