నిన్న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అభిమానుల వరకు బాగుందనిపించింది కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో కొంత మిస్సైన ఫీలింగ్ సోషల్ మీడియాలో చూపించారు. చిరంజీవి కామిక్ టైమింగ్ ని బయటికి తీసినట్టు అనిపించినా కేవలం రెండు మూడు డైలాగులతో సరిపెట్టేసి బ్యాక్ గ్రౌండ్ లో బాస్ బాస్ అంటూ హోరెత్తించడం తప్ప భీమ్స్ చేసింది ఏమి లేదనే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి.
పైగా మేకింగ్ క్వాలిటీ మీద కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రెండున్నర నిమిషాల్లో వింటేజ్ చిరంజీవిని పరిచయం చేయాలనే తాపత్రయమే ఎక్కువ బయట పడటం కాదనలేని వాస్తవం.
ఇది చూసాక ప్రధానంగా కలుగుతున్న సందేహం ఒకటే. అసలు కంటెంట్ ని అనిల్ రావిపూడి దాచారేమోనని. ఎందుకంటే మాములుగా ట్రైలర్ ని బట్టే ఆడియన్స్ ఏ సినిమాకైనా ఒక అంచనాకు వచ్చేస్తారు. వాల్తేరు వీరయ్య విషయంలో జరిగింది అదే. దాని కట్ పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో ఆడియన్స్ కి ముందే క్లారిటీ వచ్చేసింది.
రాజా సాబ్ కు రెండు టీజర్లు, ఒక ట్రైలర్ తర్వాత మళ్ళీ మూడో టీజర్ సిద్ధం చేయడం వెనుక రీజన్ జనాన్ని ప్రిపేర్ చేయడం కోసమే. కానీ అలాంటి కసరత్తు మన శంకరవరప్రసాద్ గారుకి జరగలేదనేది అభిమానుల మధ్య జరుగుతున్న చర్చ.
ఆన్ లైన్ పక్కనపెడితే గ్రౌండ్ లెవెల్ లో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోతో పాటు వెంకటేష్ క్యామియో లాంటి ఎలిమెంట్స్ మంచి అంచనాలు సృష్టించి పెట్టాయి. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సినిమా కావడంతో అంతకు మించి ఆశిస్తున్నారు మూవీ లవర్స్. వాటిని అనిల్ రావిపూడి అందుకోవాల్సిందే.
ఎందుకంటే పోటీలో ఉన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు అన్నీ వినోద ప్రధానంగా తీసిన సినిమాలే. మన శంకరవరప్రసాద్ గారు వాటి కన్నా మెరుగ్గా ఉందనిపించుకుంటేనే రేసులో ఫస్ట్ వస్తుంది. రాజా సాబ్ హారర్ జానర్ అందులోనూ ప్రభాస్ మూవీ కాబట్టి దాని క్యాలికులేషన్ వేరు.
This post was last modified on January 5, 2026 11:40 am
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…