Movie News

అన్నీ థియేటర్లోనే అంటారా అనిల్ గారూ

నిన్న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అభిమానుల వరకు బాగుందనిపించింది కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో కొంత మిస్సైన ఫీలింగ్ సోషల్ మీడియాలో చూపించారు. చిరంజీవి కామిక్ టైమింగ్ ని బయటికి తీసినట్టు అనిపించినా కేవలం రెండు మూడు డైలాగులతో సరిపెట్టేసి బ్యాక్ గ్రౌండ్ లో బాస్ బాస్ అంటూ హోరెత్తించడం తప్ప భీమ్స్ చేసింది ఏమి లేదనే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి.

పైగా మేకింగ్ క్వాలిటీ మీద కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రెండున్నర నిమిషాల్లో వింటేజ్ చిరంజీవిని పరిచయం చేయాలనే తాపత్రయమే ఎక్కువ బయట పడటం కాదనలేని వాస్తవం.

ఇది చూసాక ప్రధానంగా కలుగుతున్న సందేహం ఒకటే. అసలు కంటెంట్ ని అనిల్ రావిపూడి దాచారేమోనని. ఎందుకంటే మాములుగా ట్రైలర్ ని బట్టే ఆడియన్స్ ఏ సినిమాకైనా ఒక అంచనాకు వచ్చేస్తారు. వాల్తేరు వీరయ్య విషయంలో జరిగింది అదే. దాని కట్ పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో ఆడియన్స్ కి ముందే క్లారిటీ వచ్చేసింది.

రాజా సాబ్ కు రెండు టీజర్లు, ఒక ట్రైలర్ తర్వాత మళ్ళీ మూడో టీజర్ సిద్ధం చేయడం వెనుక రీజన్ జనాన్ని ప్రిపేర్ చేయడం కోసమే. కానీ అలాంటి కసరత్తు మన శంకరవరప్రసాద్ గారుకి జరగలేదనేది అభిమానుల మధ్య జరుగుతున్న చర్చ.

ఆన్ లైన్ పక్కనపెడితే గ్రౌండ్ లెవెల్ లో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోతో పాటు వెంకటేష్ క్యామియో లాంటి ఎలిమెంట్స్ మంచి అంచనాలు సృష్టించి పెట్టాయి. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సినిమా కావడంతో అంతకు మించి ఆశిస్తున్నారు మూవీ లవర్స్. వాటిని అనిల్ రావిపూడి అందుకోవాల్సిందే.

ఎందుకంటే పోటీలో ఉన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు అన్నీ వినోద ప్రధానంగా తీసిన సినిమాలే. మన శంకరవరప్రసాద్ గారు వాటి కన్నా మెరుగ్గా ఉందనిపించుకుంటేనే రేసులో ఫస్ట్ వస్తుంది. రాజా సాబ్ హారర్ జానర్ అందులోనూ ప్రభాస్ మూవీ కాబట్టి దాని క్యాలికులేషన్ వేరు.

Kumar

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

2 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

2 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

3 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

4 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

6 hours ago