చాలా ఏళ్ల నుంచి ఆది సాయికుమార్ పేరుతో ఒక హీరో టాలీవుడ్లో ఉన్నాడనే విషయాన్నే మరిచిపోయారు థియేటర్లకు వెళ్లే తెలుగు ప్రేక్షకులు. ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో ప్రామిసింగ్గా మొదలైన అతడి కెరీర్.. తర్వాత గాడి తప్పింది. వరుస ఫ్లాపుల దెబ్బకు మార్కెట్ జీరో అయిపోయి.. తన సినిమాలు థియేటర్లలో రిలీజవడమే గగనం అయిపోయింది. కేవలం ఓటీటీల్లో మాత్రమే తన సినిమాలకు ఆదరణ దక్కేది.
అలాంటి హీరో నుంచి వచ్చిన ‘శంబాల’ సినిమా.. క్రిస్మస్ వీకెండ్లో రిలీజై ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన తెచ్చుకుంది. దీని ప్రోమోలు చూస్తేనే ఇది విషయం ఉన్న సినిమా అని అర్థమైంది. రిలీజ్ తర్వాత కంటెంట్తో మెప్పించిన ‘శంబాల’.. క్రిస్మస్ వీకెండ్లో తీవ్రమైన పోటీని తట్టుకుని బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. రూ.20 కోట్లకు చేరువగా ఉన్నాయి ఈ సినిమా వసూళ్లు.
శంబాల విజయం ఆదితో పాటు సాయికుమార్ కుటుంబం మొత్తాన్ని ఎంతగా సంతోషంలో ముంచెత్తుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల సక్సెస్ మీట్లో సాయికుమార్తో పాటు ఆయన సోదరులు కూడా అమితానందంతో కనిపించారు.
ఇప్పుడు ఆ కుటుంబం ఆనందాన్ని రెట్టింపు చేసే పరిణామం జరిగింది. ఆది రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య పండంటి మగబడ్డకు జన్మనిచ్చింది. ఆది దంపతులకు ఇప్పటికే ఒక పాప ఉంది. తన పేరు అయానా.
తనకు బాబు పుట్టిన విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు ఆది. ఓవైపు సినిమా సూపర్ హిట్టు.. ఇంకోవైపు కొడుకు జననంతో ఆదికి సంబరాలకు అంతేలేదంటూ తన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ విషయంలో అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
This post was last modified on January 3, 2026 8:26 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…