చాలా ఏళ్ల నుంచి ఆది సాయికుమార్ పేరుతో ఒక హీరో టాలీవుడ్లో ఉన్నాడనే విషయాన్నే మరిచిపోయారు థియేటర్లకు వెళ్లే తెలుగు ప్రేక్షకులు. ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో ప్రామిసింగ్గా మొదలైన అతడి కెరీర్.. తర్వాత గాడి తప్పింది. వరుస ఫ్లాపుల దెబ్బకు మార్కెట్ జీరో అయిపోయి.. తన సినిమాలు థియేటర్లలో రిలీజవడమే గగనం అయిపోయింది. కేవలం ఓటీటీల్లో మాత్రమే తన సినిమాలకు ఆదరణ దక్కేది.
అలాంటి హీరో నుంచి వచ్చిన ‘శంబాల’ సినిమా.. క్రిస్మస్ వీకెండ్లో రిలీజై ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన తెచ్చుకుంది. దీని ప్రోమోలు చూస్తేనే ఇది విషయం ఉన్న సినిమా అని అర్థమైంది. రిలీజ్ తర్వాత కంటెంట్తో మెప్పించిన ‘శంబాల’.. క్రిస్మస్ వీకెండ్లో తీవ్రమైన పోటీని తట్టుకుని బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. రూ.20 కోట్లకు చేరువగా ఉన్నాయి ఈ సినిమా వసూళ్లు.
శంబాల విజయం ఆదితో పాటు సాయికుమార్ కుటుంబం మొత్తాన్ని ఎంతగా సంతోషంలో ముంచెత్తుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల సక్సెస్ మీట్లో సాయికుమార్తో పాటు ఆయన సోదరులు కూడా అమితానందంతో కనిపించారు.
ఇప్పుడు ఆ కుటుంబం ఆనందాన్ని రెట్టింపు చేసే పరిణామం జరిగింది. ఆది రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య పండంటి మగబడ్డకు జన్మనిచ్చింది. ఆది దంపతులకు ఇప్పటికే ఒక పాప ఉంది. తన పేరు అయానా.
తనకు బాబు పుట్టిన విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు ఆది. ఓవైపు సినిమా సూపర్ హిట్టు.. ఇంకోవైపు కొడుకు జననంతో ఆదికి సంబరాలకు అంతేలేదంటూ తన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ విషయంలో అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
This post was last modified on January 3, 2026 8:26 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…