సంక్రాంతి థియేటర్ల పంచాయితీ సోషల్ మీడియాలో మొదలైపోయింది. జనవరి 9 విడుదలవుతున్న రాజా సాబ్ మీద ఏ స్థాయిలో బజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అయితే అదే రోజు వస్తున్న డబ్బింగ్ మూవీ జన నాయకుడుకి అవసరమైనన్ని స్క్రీన్లు ఇవ్వడం పట్ల ప్రభాస్ అభిమానులు ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ కూకట్ పల్లి ఏరియాలో ఒక్క సింగల్ స్క్రీన్ లేకపోవడం పట్ల కోపంగా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయి కేటాయింపులు జరగనప్పటికీ ఫస్ట్ లిస్టుని బట్టి చూస్తే వాళ్ళ ధర్మాగ్రహం సబబుగానే అనిపిస్తోంది. నిజానికి జన నాయకుడుకి మన దగ్గర హైప్ లేదు.
పివిఆర్ ఐనాక్స్ డిస్ట్రిబ్యూషన్ తో జన నాయకుడు విడుదలవుతోంది. దీంతో సహజంగా వాళ్లకున్న మల్టీప్లెక్సులు అన్నింటిలోనూ తమిళ, తెలుగు వెర్షన్లు వేస్తున్నారు. వీటిని తగ్గించి రాజా సాబ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్. ఎందుకంటే తమిళనాడులో రాజా సాబ్ కు మొక్కుబడిగా థియేటర్లు ఇస్తున్నప్పుడు ఏపీ తెలంగాణలో మాత్రం విజయ్ మూవీకి ఎందుకు ఇన్నేసని లాజిక్ తీస్తున్నారు.
జన నాయకుడు పంపిణితో ఏ మాత్రం సంబంధం లేని ఒక అగ్ర నిర్మాతని ఈ టాపిక్ లోకి తీసుకొచ్చి ట్రోలింగ్ చేయడం ఎక్స్ లో కనిపిస్తోంది. నిజానికాయన తీసుకున్నది వేరే సినిమాలు.
నిజానికి ఈ సమస్య ఇప్పటిది కాదు. ఏళ్ళ తరబడి నలుగుతున్నదే. ప్రతిసారి తమిళ డబ్బింగ్ హక్కులు ఎవరో ఒకరు కొనడం, వాటిని ఇక్కడ సమాంతరంగా రిలీజ్ చేసి మన సినిమాల మీద ప్రభావం చూపించడం మామూలైపోయింది. ప్రతిసారి దీని గురించి మూవీ లవర్స్ గళమెత్తుతున్నారు కానీ సమాధానం దొరకడం లేదు.
ఇప్పుడే ఇలా ఉంటే జనవరి 12 నుంచి థియేటర్ల సమస్య తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండబోతోంది. పరిస్థితి ఇలా ఉంటుందని తెలిసే పరాశక్తి తెలుగు వెర్షన్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. బహుశా మన దగ్గర లేట్ రిలీజ్ ఉండొచ్చు. అలా జరిగితే మంచి నిర్ణయమే.
This post was last modified on January 3, 2026 2:58 pm
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…