Movie News

నాయకుడికి థియేటర్లు… రాజా సాబ్ ఫ్యాన్స్ ఆందోళన

సంక్రాంతి థియేటర్ల పంచాయితీ సోషల్ మీడియాలో మొదలైపోయింది. జనవరి 9 విడుదలవుతున్న రాజా సాబ్ మీద ఏ స్థాయిలో బజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అయితే అదే రోజు వస్తున్న డబ్బింగ్ మూవీ జన నాయకుడుకి అవసరమైనన్ని స్క్రీన్లు ఇవ్వడం పట్ల ప్రభాస్ అభిమానులు ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ కూకట్ పల్లి ఏరియాలో ఒక్క సింగల్ స్క్రీన్ లేకపోవడం పట్ల కోపంగా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయి కేటాయింపులు జరగనప్పటికీ ఫస్ట్ లిస్టుని బట్టి చూస్తే వాళ్ళ ధర్మాగ్రహం సబబుగానే అనిపిస్తోంది. నిజానికి జన నాయకుడుకి మన దగ్గర హైప్ లేదు.

పివిఆర్ ఐనాక్స్ డిస్ట్రిబ్యూషన్ తో జన నాయకుడు విడుదలవుతోంది. దీంతో సహజంగా వాళ్లకున్న మల్టీప్లెక్సులు అన్నింటిలోనూ తమిళ, తెలుగు వెర్షన్లు వేస్తున్నారు. వీటిని తగ్గించి రాజా సాబ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్. ఎందుకంటే తమిళనాడులో రాజా సాబ్ కు మొక్కుబడిగా థియేటర్లు ఇస్తున్నప్పుడు ఏపీ తెలంగాణలో మాత్రం విజయ్ మూవీకి ఎందుకు ఇన్నేసని లాజిక్ తీస్తున్నారు.

జన నాయకుడు పంపిణితో ఏ మాత్రం సంబంధం లేని ఒక అగ్ర నిర్మాతని ఈ టాపిక్ లోకి తీసుకొచ్చి ట్రోలింగ్ చేయడం ఎక్స్ లో కనిపిస్తోంది. నిజానికాయన తీసుకున్నది వేరే సినిమాలు.

నిజానికి ఈ సమస్య ఇప్పటిది కాదు. ఏళ్ళ తరబడి నలుగుతున్నదే. ప్రతిసారి తమిళ డబ్బింగ్ హక్కులు ఎవరో ఒకరు కొనడం, వాటిని ఇక్కడ సమాంతరంగా రిలీజ్ చేసి మన సినిమాల మీద ప్రభావం చూపించడం మామూలైపోయింది. ప్రతిసారి దీని గురించి మూవీ లవర్స్ గళమెత్తుతున్నారు కానీ సమాధానం దొరకడం లేదు.

ఇప్పుడే ఇలా ఉంటే జనవరి 12 నుంచి థియేటర్ల సమస్య తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండబోతోంది. పరిస్థితి ఇలా ఉంటుందని తెలిసే పరాశక్తి తెలుగు వెర్షన్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. బహుశా మన దగ్గర లేట్ రిలీజ్ ఉండొచ్చు. అలా జరిగితే మంచి నిర్ణయమే.

Kumar

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

4 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

4 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

4 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

4 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

6 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

7 hours ago