Movie News

నాయకుడికి థియేటర్లు… రాజా సాబ్ ఫ్యాన్స్ ఆందోళన

సంక్రాంతి థియేటర్ల పంచాయితీ సోషల్ మీడియాలో మొదలైపోయింది. జనవరి 9 విడుదలవుతున్న రాజా సాబ్ మీద ఏ స్థాయిలో బజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అయితే అదే రోజు వస్తున్న డబ్బింగ్ మూవీ జన నాయకుడుకి అవసరమైనన్ని స్క్రీన్లు ఇవ్వడం పట్ల ప్రభాస్ అభిమానులు ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ కూకట్ పల్లి ఏరియాలో ఒక్క సింగల్ స్క్రీన్ లేకపోవడం పట్ల కోపంగా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయి కేటాయింపులు జరగనప్పటికీ ఫస్ట్ లిస్టుని బట్టి చూస్తే వాళ్ళ ధర్మాగ్రహం సబబుగానే అనిపిస్తోంది. నిజానికి జన నాయకుడుకి మన దగ్గర హైప్ లేదు.

పివిఆర్ ఐనాక్స్ డిస్ట్రిబ్యూషన్ తో జన నాయకుడు విడుదలవుతోంది. దీంతో సహజంగా వాళ్లకున్న మల్టీప్లెక్సులు అన్నింటిలోనూ తమిళ, తెలుగు వెర్షన్లు వేస్తున్నారు. వీటిని తగ్గించి రాజా సాబ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్. ఎందుకంటే తమిళనాడులో రాజా సాబ్ కు మొక్కుబడిగా థియేటర్లు ఇస్తున్నప్పుడు ఏపీ తెలంగాణలో మాత్రం విజయ్ మూవీకి ఎందుకు ఇన్నేసని లాజిక్ తీస్తున్నారు.

జన నాయకుడు పంపిణితో ఏ మాత్రం సంబంధం లేని ఒక అగ్ర నిర్మాతని ఈ టాపిక్ లోకి తీసుకొచ్చి ట్రోలింగ్ చేయడం ఎక్స్ లో కనిపిస్తోంది. నిజానికాయన తీసుకున్నది వేరే సినిమాలు.

నిజానికి ఈ సమస్య ఇప్పటిది కాదు. ఏళ్ళ తరబడి నలుగుతున్నదే. ప్రతిసారి తమిళ డబ్బింగ్ హక్కులు ఎవరో ఒకరు కొనడం, వాటిని ఇక్కడ సమాంతరంగా రిలీజ్ చేసి మన సినిమాల మీద ప్రభావం చూపించడం మామూలైపోయింది. ప్రతిసారి దీని గురించి మూవీ లవర్స్ గళమెత్తుతున్నారు కానీ సమాధానం దొరకడం లేదు.

ఇప్పుడే ఇలా ఉంటే జనవరి 12 నుంచి థియేటర్ల సమస్య తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండబోతోంది. పరిస్థితి ఇలా ఉంటుందని తెలిసే పరాశక్తి తెలుగు వెర్షన్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. బహుశా మన దగ్గర లేట్ రిలీజ్ ఉండొచ్చు. అలా జరిగితే మంచి నిర్ణయమే.

This post was last modified on January 3, 2026 2:58 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

53 minutes ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

7 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

8 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

9 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

10 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

11 hours ago