అనూహ్య పరిణామాల మధ్య డిసెంబరు 5న రిలీజ్ ఆగి.. ఇంకో వారం ఆలస్యంగా రిలీజైన నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ-2 అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఐతే తొలి వీకెండ్ తర్వాత ఈ సినిమా వసూళ్లు బాగా డ్రాప్ కాగా.. అంతటితో సినిమా పనైపోయిందని అంతా అనుకున్నారు.
కానీ అఖండ-2 బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ను బ్యాడ్ అని చెప్పలేని విధంగా.. తర్వాతి రెండు వీకెండ్లలో కూడా మంచి వసూళ్లే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్లు మరీ పెద్దవి కావడం వల్ల సినిమాను బాక్సాఫీస్ లెక్కల్లో ఫ్లాప్ అని చెప్పాలి కానీ.. ఈ సినిమా వసూళ్లను తక్కువ చేయలేం. ఇప్పటికీ ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోందీ చిత్రం. ఐతే సంక్రాంతి సినిమాల సందడి మొదలయ్యాక అఖండ-2 రన్ పూర్తవుతుందన్నది స్పష్టం.
మరి అఖండ-2 ఓటీటీ విందు ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఆ కబురు త్వరలోనే అధికారికంగా వినబోతున్నారు. జనవరి 9 నుంచి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ వీకెండ్లోనూ అఖండకు ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. కాబట్టి ఆ తర్వాత డిజిటల్ రిలీజ్ గురించి నెట్ఫ్లిక్స్ ప్రకటన చేసే అవకాశముంది.
ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే జనవరి 2నే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లోకి రావాల్సింది. కానీ డిసెంబరు 5 నుంచి 12కు వాయిదా పడ్డ నేపథ్యంలో స్ట్రీమింగ్ డేట్ కూడా వారం వెనక్కి జరిగింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ-2ను 14 రీల్స్ ప్లస్ బేనర్ మీద రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు బాలయ్య కెరీర్లోనే అత్యధికంగా 200 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఫుల్ రన్లో నైజాం మినహా ఈ సినిమా ఎక్కడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
This post was last modified on January 3, 2026 10:01 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…