శివరాజ్ కుమార్ కన్నడలో సీనియర్ స్టార్ హీరో అయినప్పటికీ మనకు ఎక్కువ కనెక్ట్ కావడం మొదలయ్యింది జైలర్ తర్వాతే. రామ్ చరణ్ పెద్దిలో ఎప్పుడైతే గౌర్ నాయుడుగా ఒక ముఖ్యమైన పాత్ర దక్కించుకున్నారో అప్పటి నుంచి మరింత దగ్గరైన ఫీలింగ్ అభిమానుల్లో కలిగింది.
దీనికన్నా ముందు గౌతమీపుత్ర శాతకర్ణిలో బుర్రకథ పాటకు డాన్స్ చేసిన శివన్నకు అందులో బాలకృష్ణతో పెద్దగా కాంబో సీన్స్ లేకపోవడంతో ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. గుమ్మడి నరసయ్యలో టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ లెజెండరీ యాక్టర్ కొత్త మూవీ 45 గత వారం డిసెంబర్ 25 కన్నడలో విడుదలయ్యింది. అసలు విశేషం ఇది కాదు.
ఇందులో ఉపేంద్ర కూడా ఉన్నాడు. మల్టీస్టారర్ గా రూపొందిన 45కి మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య తొలిసారి దర్శకత్వం వహించారు. చాలా క్రిటికల్ పాయింట్ తో 45 రూపొందింది. మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు, ప్రకృతి, నైతిక విలువలు అంటూ చాలా అంశాలు ఇందులో తీసుకున్నారు.
చాలా టఫ్ అనిపించే స్క్రీన్ ప్లే ఎంచుకున్న అర్జున్ జన్య కర్ణాటకలో విమర్శల ప్రశంసలు అందుకున్నారు. కమర్షియల్ గా వసూళ్లు బాగానే ఉన్నాయి కానీ మరీ బ్లాక్ బస్టర్ అనిపించుకునే స్థాయిలో మేజిక్ చేయలేదు. కాకపోతే మంచి ప్రయత్నం, విభిన్నంగా ఉంది, చూడొచ్చనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.
ఇప్పుడీ 45 తెలుగులో రేపు రిలీజవుతోంది. కొత్త సంవత్సర కానుక మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇటీవలే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ కంటెంట్ ఇంకా కామన్ ఆడియన్స్ కి చేరలేదు.
విచిత్రమైన గెటప్పులుతో, అర్థం కాని బ్యాక్ గ్రౌండ్ తో వెరైటీగా రూపొందిన 45లో శివరాజ్ కుమార్ అమ్మాయి వేషం వేయడం గమనార్హం. పోటీలో సైక్ సిద్దార్థ, సుదీప్ మార్క్, వనవీర లాంటి కంటెంట్ మీద ఆధారపడ్డ సినిమాలే ఉండటంతో ఆ అడ్వాంటేజ్ వాడుకునే ఛాన్స్ 45కి ఉంది. కానీ అలా చేసే దిశగా పెద్దగా సౌండ్ వినిపించడం లేదు. టాక్ ఎలా వస్తుందో చూడాలి.
This post was last modified on December 31, 2025 12:17 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…